ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఫైరింగ్.. కలకలం రేపుతున్న కాల్పులు

ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కాల్పులు జరిగాయి. తనని దూషించారని మాజీ ఎమ్మెల్యే కన్వర్ , ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పాటు కాల్పులు జరిపారు. కోపంతో ఎమ్మెల్యే కూడా కాల్పులు జరపడంతో పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు.

New Update
Uttarkhand

Uttarkhand Photograph: (Uttarkhand)

ఉత్తరాఖండ్‌లో పదవిలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. రూర్కీలోని ఖాన్‌పూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే లస్కర్‌ కన్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ ఛాంపియన్‌ మధ్య పట్ట పగలే కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గ్యాంగ్‌వార్‌ అనేలా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య 2022 నుంచి వైరం ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు కామెంట్ల చేసుకోవడంతో వివాదం ఇంకా ముదిరింది. దీంతో కాల్పులు జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

కాల్పులు జరిపారని.. ఎదురు కాాల్పులు..

మాజీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఉమేష్‌ కుమార్‌ దూషించారని.. ఛాంపియన్ అనుచరులు వారితో గొడవకు దిగారు. ఉమేష్ ఇంటి వద్ద రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కూడా మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. వీరిద్దరిని కోర్టులో హాజరు పరచగా.. ఎమ్మెల్యేకు బెయిల్‌ లభించింది. కానీ మాజీ ఎమ్మెల్యేకు లభించలేదు. మాజీ ఎమ్మెల్యేకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. 

ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment