Bharat: భారత్ కు యుద్ధ విమానాలు: ట్రంప్‌!

ఢిల్లీకి అధునాతన ఎఫ్‌ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు.భారత్‌ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను, ఎఫ్‌ 35 స్టెల్తా ఫైటర్‌ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్‌ వెల్లడించారు. 

New Update
trump and modi 1

trump and modi 1

సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ..భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది. ఢిల్లీకి అధునాతన ఎఫ్‌ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న  ప్రధాని మోడీ..ఆయనతో భేటీ అయిన సంగతి  తెలిసిందే.

Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాల పై దేశాధినేతలు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ .. దీనికంటే వరుణ్ తేజ్ మట్కా బెటర్ అంట!

అమెరికా-భారత్‌ కోసం అద్భతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సమీప భవిష్యత్తులో భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ ను భారత్‌ కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి భారత్‌ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం. ఎఫ్‌ 35 స్టెల్తా ఫైటర్‌ జెట్లను కూడా విక్రయించేంఉదకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ వెల్లడించారు. 

ద్వైపాక్షిక వాణిజ్యమే...

అనంతరం మోడీ మాట్లాడుతూ..ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నాం.అమెరికాలో చమురు,గ్యాస్‌ వాణిజ్యం పైనా దృష్టిపెడతాం. 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం అని తెలిపారు.

రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలను  గురించి మోడీ మాట్లాడారు. యుద్ధం విషయంలో భారత్‌ ది తటస్థ వైఖరి కాదు. మేం శాంతి వైపు నిలబడతాం. ఇది యుద్ధాల శకం కాదని ఇది వరకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు చెప్పా. ఉద్రిక్తతలను ఆపడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్ధతిస్తున్నా అని మోడీ వెల్లడించారు.

ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్ అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. దీని నుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా మేక్‌ ఇండియా గ్రేట్‌ అగైన్‌ నినాదం ఇస్తున్నట్లు మోడీ ఈ సందర్భంగా తెలిపారు. మెగా,మిగా కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Also Read: Fastag: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

Also Read: Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్‌, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.

New Update
terrorist arrest

terrorist arrest Photograph: (terrorist arrest)

భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు