CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్

కేంద్రీయ విద్యాలయాల్లో రూల్స్ మారనున్నాయి. కొత్త విద్యావిధానాలను ప్రవేశపెడుతున్నారు. దాని ప్రకారం 2026 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రెండు సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడమే కాకుండా..దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ను రిలీజ్ చేశారు. 

New Update
CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..

సీబీఎస్ఈ విద్యావిధానంలో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం టెన్త్ ఎగ్జామ్స్ ఇకపై రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ(CBSE) పబ్లిక్‌ నోటీస్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది కేంద్ర విద్యాశాఖ. కొత్త రూల్స్ ప్రకారం ఫిబ్రవరి..మార్చిలో మొదటి విడత పరీక్షలు, మే నెలలో రెండో విడత పరీక్షలు ఉంటాయి. ఇవి రెండూ కూడా పూర్తి సిలబస్ ఆధారంగానే నిర్వహిస్తారు. 

రెండుసార్లు పరీక్షలతో అధిక స్కోర్లు..

అయితే రెండుసార్లు పరీక్షలు ఉన్నా ప్రాక్టికల్స్, ఇతర స్కోర్లు మాత్రం ఒక్కసారే లెక్కిస్తారు. అయితే ఇలా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులు అధిక స్కోర్సు సాధించడానికి ఉపయోగపడుతుందని చెబుతోంది కేంద్రం. ఒకసారి పరీక్షలు బాగా రాయకపోయినా...రెండో సారి రాసిన వాటిల్లో మంచి మార్కులు వస్తే..రెండూ కలిపి టోటల్ చేస్తారు కాబట్టి మొత్తానికి మంచి స్కోర్ వస్తుందని చెబుతోంది. విస్తృతమైన చర్చల తర్వాత రెండు సార్లు పరీక్షలకు సంబంధించిన ముసాయిదాను రూపొందించారు. దీనిని ఇప్పుడు తమ వెబ్‌సైట్‌లో చూడొచ్చని కేంద్రం తెలిపింది.  ఈ ముసాయిదా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చి 9లోగా స్పందించవచ్చని బోర్డు సూచించింది. 

Also Read: USA: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య కోల్డ్ వార్..అసలేం జరుగుతోంది..

వెబ్ సైట్ లో వచ్చిన స్పందనలను లెక్కలోకి తీసుకుని , పరిశీలించిన తర్వాత...ఏమైనా సవరించాల్సి ఉంటే అవి కూడా చేసి అప్పుడు కొత్త విధానాలను అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ డాక్టర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌. 026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత, మే 5 నుంచి 20 వరకు రెండో విడత నిర్వహించనున్నారు. దీంతో పాటు ముసాయిదా డేట్‌ షీట్స్‌ను సైతం విడుదల చేశారు.

Also Read: TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!

ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్‌ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.

New Update
Delhi woman dies after falling from Roller Coaster

Delhi woman dies after falling from Roller Coaster

నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

ఏం జరిగిందంటే?

నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!

కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

(crime news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment