Three Language Formula: తమిళనాడులో త్రిభాషా ఫార్ములాపై రగడ.. హిందీ పేర్లు కొట్టేస్తున్న DMK కార్యకర్తలు

NEP 2020లో త్రిభాషా ఫార్ములా గురించి DMK, BJP పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. DMK కార్యకర్తలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. త్రిభాష విధానాన్ని వ్యతిరేఖిస్తూ మంగళవారం BJP నాయకురాలు రంజన నాచియార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసింది.

New Update
Three Language Formula

Three Language Formula Photograph: (Three Language Formula)

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా అమలు గురించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్‌ బోర్డులపై హిందీ అక్షరాలను నల్లరంగుతో కనిపించకుండా చేశారు. అంతేకాదు త్రి భాష విధానాన్ని వ్యతిరేఖిస్తూ మంగళవారం బీజేపీ పార్టీ నాయకురాలు రంజన నాచియార్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది.

ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు! 

డీఎంకే కార్యకర్తలు ఆదివారం, సోమవారాల్లో పాలక్కాడ్, పాలైయంకోట్టై రైల్వే స్టేషన్‌లోని బోర్టులపై హిందీ పేర్లకు బ్లాక్‌ పెయింట్‌ వేశారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్‌, జీఎస్టీ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలకు నల్లరంగు పూశారు. 

ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్‌!

హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికార డీఎంకేపై బీజేపీ మండిపడింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరి కుట్ర అని విమర్శించారు. వారి సొంత పిల్లలు మల్టీ లాంగ్వేజ్‌ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. డీఎంకే పార్టీ వారికో న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం చెబుతుందా అని అని ఎక్స్‌లో ఆరోపించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం

సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు. 

New Update
P.Chidambaram: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే : పి. చిదంబరం

P. Chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

ఏమవ్వలేదు...బావున్నారు..

ఆసుపత్రిలో చికిత్స అనంతరం చిదంబరం కోలుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ గురైయ్యానని కాంగ్రెస్ నేత తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఆలోచించన వారందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిదంబరం కుమారుడు కార్తీ కూడా దీనిపై స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. హార్ట్, బ్రెయిన్ డాక్టర్లతో సహా అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు తమ తండ్రిని పరీక్షించారని...అన్ని రిపోర్ట్ లు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.  స్థానిక జైడస్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

 

 today-latest-news-in-telugu | p-chidambaram | congress | health 

 

Also read :  Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment