Police Medals: పోలీస్ పతాకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికి?

కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించిన పతకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 942 మందికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికయ్యారు.

New Update
Police medals

Police medals Photograph: (Police medals)

Police Medals: గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించి పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్‌ సర్వీస్‌(Fire Service), హోంగార్డ్‌(Home Guard), సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు(Civil Defence Officers) గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. దీనికి సంబంధించిన జాబితను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఈ గ్యాలంట్రీ పతకాలను మొత్తం 942 మందికి అందజేయనుంది. ఇందులో 95 మందికి మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, ఇద్దరికీ ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 746 మందికి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకాలను కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 12 మందికి..

 పోలీస్‌ విశిష్ఠ సేవా(Police Medal for Meritorious Service) పతకాలకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 12 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌(Andra Pradesh) నుంచి చీఫ్‌ హెడ్‌ వార్డర్‌ కడాలి అర్జునరావుకి పతకం దక్కగా.. వార్డర్‌ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కూడా కరెక్షనల్‌ సర్వీస్‌ విభాగంలో పోలీస్‌ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. ఐపీఎస్ విక్రమ్‌సింగ్‌ మన్‌, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్‌ రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపిక కావడంతో పాటు మరికొందరు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోనే 14 మంది స్థానిక ఉగ్రవాదులు.. లిస్టు రిలీజ్!

జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్‌లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

New Update
 14 local terrorists

14 local terrorists

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత టెర్రరిస్టులను అంతమొందించడానికి ఇండియన్ ఆర్మీ ఏకకాలంలో అనేక కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పటివరకు 7 మంది ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం ధ్వంసం చేసింది. అంతేకాకుండా భారత సైన్యం చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్‌లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించింది. 

20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యున్న వీరంతా  హిజ్బుల్ ముజాహిదీన్ , లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్  గ్రూపులకు చెందినవారని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఈ లిస్టులో అవంతిపోరాలో ఒక జైష్ ఉగ్రవాది చురుకుగా ఉన్నట్లు , లష్కరే, జైష్‌లకు చెందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు పుల్వామాలో చురుకుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సోఫియాన్‌లో ఒక హిజ్బుల్, నలుగురు లష్కర్లు, అనంత్‌నాగ్‌లో ఇద్దరు స్థానిక హిజ్బుల్ ఉగ్రవాదులు, కుల్గాంలో ఒక స్థానిక లష్కర్ ఉగ్రవాది చురుకుగా ఉన్నట్లుగా  ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి.  

ఉగ్రవాదుల  పేర్లు: 

ఆదిల్ రెహమాన్ డెంటూ (21), ఆసిఫ్ అహ్మద్ షేక్ (28), అహ్సాన్ అహ్మద్ షేక్ (23), హారిస్ నజీర్ (20), ఆమిర్ నజీర్ W(20), యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ ఖండే (24), నసీర్ అహ్మద్ వాని (21), షాహిద్ అహ్మద్ కుటాయ్ (27), ఆమిర్ అహ్మద్ దార్, అద్నాన్ సఫీ దార్, జుబైర్ అహ్మద్ వాని (39), హరూన్ రషీద్ గనై (32), జాకీర్ అహ్మద్ గనీ (29).

 

Advertisment
Advertisment
Advertisment