Tesla: భారత్‌కు రానున్న టెస్లా కార్లు !

భారత్‌లో టెస్లా కార్లు విక్రయించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం టెస్లా.. సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market

Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market

భారత్‌లో టెస్లా కార్లు విక్రయించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం టెస్లా.. సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి విదేశాలకు చెందిన కార్లను దేశంలో అమ్మాలంటే సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఆ వాహనం రహదారికి యోగ్యమైందని.. భారత్‌లో తయారు చేసినా లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు ఉండే రూల్స్‌కు అనుగుణంగా ఉందని వెరిఫై చేసే ప్రక్రియ. అందుకే టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారత్‌లో మోడల్ వై, మోడల్ 3 కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులు చేసింది.

Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!

ప్రస్తుతం టెస్లా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల విక్రయాల సంస్థగా కొనసాగుతోంది. భారత్‌లో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ఈ కంపెనీ యత్నిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే త్వరలోనే టెస్లా కార్లు ఇండియన్ మార్కెట్‌లోకి అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది. కానీ టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను ఇండియాలో ప్రారంభిస్తారా ? లేదా ? అనేదానిపై క్లారిటీ లేదు. 

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

అమెరికాలో టెస్లా కారు చవకగా ఉంది. మోడల్ 3 ధర ఫ్యాక్టరీ స్థాయిలో 35 వేల డాలర్లు (రూ.30.4 లక్షలు) గా ఉంది. ఇక భారత్‌లో దిగుమతి సుంకాలు 15 నుంచి 20 శాతం తగ్గించడం, రోడ్‌ ట్యాక్స్ అలాగే ఇన్సూరెన్స్ వంటి ఖర్చులతో కలిపి ఆన్‌రోడ్ ధర 40 వేల డాలర్లు(దాదాపు రూ.35-40 లక్షలు)గా ఉంటుంది. ఇక టెస్లా మోడల్ వై ధరలు చూసుకుంటే రూ.70 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

Also Read: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment