Watch Video: 35 లగ్జరీ కార్లతో స్టంట్లు చేసిన విద్యార్థులు.. చివరికి..!

గుజరాత్‌లోని ఓ స్కూల్‌లో నిర్వహించిన పార్టీకి 35 లగ్జీరీ కార్లతో కాన్వాయ్‌గా వెళ్లి హంగామా చేసిన దృశ్యాలు వైరలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు.

New Update
Teen Students In Surat Perform Stunts In Luxury Cars To Celebrate Farewell

Teen Students In Surat Perform Stunts In Luxury Cars To Celebrate Farewell

గుజరాత్‌లోని ఓ స్కూల్‌లో నిర్వహించిన పార్టీకి 35 లగ్జీరీ కార్లతో కాన్వాయ్‌గా వెళ్లి హంగామా చేసిన దృశ్యాలు వైరలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. అలాగే 22 కార్లను సీజ్‌ చేశారు. మిగతా కార్ల కోసం గాలిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని ఓల్పాడ్ ప్రాంతంలో ఓ పాఠశాలలో ఇటవలే ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. 

Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!

ఈ క్రమంలోనే ఈ పార్టీలో పాల్గొనేందుకు పలువురు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 35 లగ్జరీ కార్లను రెడీ చేసుకున్నారు. BMW, బెంజ్, ఆడీ, మసెరాటి, పోర్షే వంటి లగ్జరీ కార్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కొందరు విద్యార్థులు కార్లు నడుపుతుండగా.. మరికొందరు డోర్లపై ప్రమాదకరంగా కూర్చుకున్నారు. మరికొందర్ సన్‌రూఫ్‌పై స్మో్క్‌గన్‌లతో స్టంట్లు చేస్తూ వెళ్లారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 

Also Read:  ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!

దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. చివరికి ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఆరు కేసులు నమోదు చేశారు. 35 కార్లలో 26 గుర్తించారు. అందులో 22 వెహికిల్స్‌ను సీజ్‌ చేశారు. వాటి యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. పలువురు స్టూడెంట్స్‌ తల్లిదండ్రులతో పాటు సంట్లు చేసి నడిపిన డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment