Tamilnadu: చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్‌ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్‌ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
Karl Marx and CM Stalin

Karl Marx and CM Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్‌ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కార్ల్‌మార్క్స్‌ కాలంలోనే లేబర్ ఉద్యమం ఓ శతాబ్ధం పాటు కొనసాగిందని తెలిపారు.  

Also Read: ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

ఆల్ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యుడు పీకే మూకియా థీవర్‌ స్మారక భవనాన్ని కూడా మధురై జిల్లాలో నిర్మించనున్నట్లు స్టాలిన్ తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో రూల్‌ 110 కింద సుమోటో ప్రకటన చేశారు. ప్రపంత నేత కార్ల్‌మార్క్స్‌కు ద్రవిడ మోడల్‌ ప్రభుత్వం నివాళులు అర్పించనుందని పేర్కొన్నారు. కార్ల్‌మార్క్స్ దార్శనికత కలిగిన నేతని, ఉద్యమ కారుడని సీఎం స్టాలిన్ అన్నారు. కమ్యూనిజం ఫిలాసఫీని రూపొందించారని.. ప్రపంచ కార్మికులను ఏకం చేశారని తెలిపారు.  

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ఇదిలాఉండగా.. తమిళనాడు ప్రభుత్వం డీలిమిటేషన్, త్రిభాష విధానంపై కేంద్రంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాష సూత్రాన్ని అమలు చేయమని, ద్విభాషా సూత్రానికే తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసింది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు డీలిమిటేషన్‌ వల్ల సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించింది. 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో కలిసి నిర్వహించిన జేఏసీ మీటింగ్‌లో ప్రతిపాదించింది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: విదేశాలపై ట్రంప్‌ టారీఫ్‌.. అమెరికాకు మాంద్యం తప్పందంటున్న పెట్టుబడిదారులు !

tamilnadu | rtv-news | karl-marx | cm-stalin

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment