Delhi: కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియో వైరల్

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలపై సీజేఐకి 25 పేజీల రిపోర్టు అందింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ దీన్ని సమర్పించారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court makes report on Justice Varma cash row public, videos show burnt currency

Supreme Court makes report on Justice Varma cash row public, videos show burnt currency

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ 25 పేజీల రిపోర్టును శనివారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించారు. ఇందులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన వివరాలతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అంతేకాదు ఈ రిపోర్టును సుప్రీంకోర్టు శనివార రాత్రి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.  

Also Read: రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీపే ఉపాధ్యాయ రిపోర్టును పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్ట గురించి ఉంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఉందనే విషయం అందులో కనిపించింది. అయితే స్టోర్‌రూమ్‌లో తాను గానీ, తన కుటంబ సభ్యులు గానీ ఎలాంటి నగదు ఉంచలేదని జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ తెలిపారు. తమకు చెందిన నగదు దొరికినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.  

Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?

మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌, పంజాబ్‌-హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ శీల్‌ నాగు ఉంటారు. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతం కేసుల విచారణపై ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించారు. 

Also Read: బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు!

delhi | delhi-high-court | telugu-news | rtv-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment