/rtv/media/media_files/2026/03/31/stampede-broke-out-at-the-sheetla-temple-2026-03-31-11-45-34.jpg)
stampede broke out at the Sheetla Temple in Nalanda, Bihar
బిహార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీతల మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఈ ఆలయానికి పూజలు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విపరీతంగా రద్దీ ఏర్పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
नालंदा के शीतला मंदिर में मची भगदड़, मातम में बदली खुशियाँ, 8 लोगों की मौत
— NSC9 News (@nsc9news) March 31, 2026
बिहार के नालंदा से एक दिल झकझोर देने वाली खबर सामने आ रही है। बिहार शरीफ स्थित प्रसिद्ध माता शीतला मंदिर में चैत्र अष्टमी के अंतिम मंगलवार को भारी भीड़ के चलते अचानक भगदड़ मच गई।
शुरुआती खबरों के… pic.twitter.com/XyyaRwGAUI
తొక్కిసలాటకు కారణం ఇదే
బీహార్లోని నలంద నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో మఘ్రా అనే గ్రామంలో శీతల మాత అష్టమి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా చైత్రమాసం చివరి మంగళవారం నాడు అమ్మవారికి భక్తులు ప్రసాదం సమర్పిస్తారు. ముందు రోజు వండిన ఆహారాన్ని అంటే చద్దన్నాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు. శీతల మాతకు ఈ ఆహారం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి ఈ ప్రసాదం సమర్పించేందుకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మహిళలు ఎగబడ్డారు. గుడిలో స్థలం తక్కువగా ఉండటం.. వేలాది సంఖ్యలో మహిళలు వచ్చారు. భద్రతా లోపంతోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.
Follow Us