Snake Video : వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ నుంచి ముంబయికి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం అందిచగా వాళ్లు పామును పట్టుకొని బయట వదిలేశారు.

author-image
By B Aravind
New Update
Snake

సాధారణంగా పామును చూస్తే కొందరు భయంతో పరుగులు తీస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్ల పొదల్లోనే కాదు.. అప్పుడప్పుడు పలువురి ఇళ్లల్లోకి కూడా పాములు దూరుతుంటాయి. కొంతరైతే పామును చూశాక చంపేస్తుంటారు కూడా. మరికొందరు అడవిలోకి వదిలేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా నడుస్తున్న రైల్లోనే ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జబల్‌పుర్‌- ముంబయి గరీబ్‌రత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.  

Also Read: ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్‌!

ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గరీబ్‌రత్‌ అనే ఎక్స్‌ప్రెస్‌ రైలు జబల్‌పుర్‌ నుంచి ముంబయికి బయలుదేరింది. అయితే మహారాష్ట్రలోని కాసర రైల్వే స్టేషన్‌ను రైలు చేరుకునే సమయంలో ఏసీ కోచ్‌ జీ-3లో ఒక్కసారిలో పాము ప్రత్యక్షమైంది. పైన బెర్త్‌ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. దాన్ని చూసి భయపడ్డ ప్రయణికులు వేరే కోచ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఆ పామును పట్టుకొని బయట వదిలేశామని స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు.

New Update
V BREAKING

వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు అత్యున్నత న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు. కేసు విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టాల అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. ముస్లీం కమ్యూనిటీ అధికారాలను లాక్కునేందుకు కుట్ర జరుగుతుందని కపిల్ సిబల్ కోర్టులో పేర్కొన్నారు. వక్ఫ్ నూతన చట్టాలు మతస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

Also read: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా..? అయితే ఇలా చేయండి

హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుందా, హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని సీజేఐ ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు భూముల్లోనే ఉందని సీజేఐ అన్నారు. చారిత్రాత్మక ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించలేమన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. 2వారాల్లో కేంద్రం వక్ఫ్ చట్టంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు పంపింది. కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధికారం కల్పించడంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

 

 

 

Advertisment
Advertisment
Advertisment