Gold Smuggling: ఖజ్జూర పండ్లలో బంగారం, విగ్‌లో కొకైన్.. పుష్పా మించిన ట్విస్టులు (VIDEO)

ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. జెడ్డా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఓ వ్యక్తి ఖజ్జూర పండ్లలో 172 గ్రాముల బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పడ్డుపడ్డాడు. కొద్దిరోజుల క్రితమే మరో వ్యక్తి విగ్‌లో కెకైన్ పెట్టి పట్టపడ్డాడు.

New Update
Smuggling of Gold at Delhi

Smuggling of Gold at Delhi Photograph: (Smuggling of Gold at Delhi)

Gold Smuggling: పుష్పా సినిమాలో ఎర్రచందనం(Red Sandalwood) స్మగ్లింగ్ ట్విస్ట్‌ను మించిన ట్విస్టులు ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో బయటపడుతున్నాయి. స్మగ్లర్లకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో మరి! కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ స్మిగ్లింగ్ వ్యవహారంలో దొరికినోడు దొంగ.. దొరకనోడు దొర అన్నట్టే ఉంటుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రమంలో బంగారాన్ని అక్రమంగా త‌ర‌లిస్తున్న ఓ వ్యక్తిని ప‌ట్టుకున్నారు. అత‌ని వ‌ద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగార‌న్ని స్వాధీనం చేసుకున్నారు. 56 ఏళ్ల వ‌య‌సున్న ఓ ప్రయాణికుడు.. జెడ్డా నుంచి ఢిల్లీకి వ‌చ్చాడు. అత‌ను ఎస్వీ-756 విమానంలో ప్రయాణించాడు. అయితే బ్యాగేజీ చెకింగ్ స‌మ‌యంలో అత‌ని ల‌గేజీపై అనుమానం వ‌చ్చింది. ఖ‌ర్జూర పండ్లలో బంగారాన్ని దాచి.. తీసుకెళ్తున్నట్లు క‌స్టమ్స్ అధికారులు అనుమానించారు.

Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

Also read : త్వరలోనే భూమి అంతం.. న్యూటన్ చెప్పింది నిజం అవుతుందా?

ఖ‌ర్జూర పండ్లలో బంగారం..

పండ్లు ఉన్న మూట‌ను ఓపెన్ చేసి ప‌రిశీలించారు. ఖజ్జూరు పండ్ల గింజల ప్లేస్‌లో బంగారు అమ‌ర్చిన‌ట్లు గుర్తించారు. ఓ చైన్ కూడా ఆ ఖ‌ర్జూర పండ్ల బ్యాగ్‌లో ఉన్నది. ఖ‌ర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగిస్తున్నట్లు చెప్పారు. గతవారం ఇదే విమానాశ్రయంలో విగ్‌లో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నాడు. తలకు విగ్ అతకించి.. అందులో 200 గ్రాముల కొకేన్ కొలంబియా నుంచి తీసుకువచ్చాడు. మొత్తం 19 క్యాప్యుల్ విలువ 10వేల యూరోలు ఉంటుదని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే

Also Read: Delhi AIIMS: ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING : సుప్రీం కోర్టు నూతన CJIగా BR గవాయ్ పేరు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

New Update
new CJI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టకు రాకముందు ముంబై హైకోర్టు జడ్జిగా చాలాకాలం పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో గవాయ్ జన్మించారు. 64 ఏళ్ల జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 2025 లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

ఈయన తండ్రి ఏఆర్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, బీహార్, కేరళా,సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా కూడా పని చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment