Kerala Crime News: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

కేరళలో  సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మాకు నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన ప్రియుడు షరోన్ రాజ్ అనే 23 ఏళ్ల యువకుడికి  విషమిచ్చి చంపిన గ్రీష్మాకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

author-image
By Krishna
New Update
Sharon Raj murder case

Sharon Raj murder case Photograph: (Sharon Raj murder case)

Kerala Crime News: కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మాకు నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన ప్రియుడు షరోన్ రాజ్ అనే 23 ఏళ్ల యువకుడికి  విషమిచ్చి చంపిన గ్రీష్మాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మూడో నిందితుడు గ్రీష్మా మేనమామ నిర్మలకుమారన్ నాయర్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.  ప్రియుడిని కిడ్నాప్ చేసినందుకు10 ఏళ్లు.. దర్యాప్తును తప్పుదారి పట్టించినందుకు మరో ఐదు సంవత్సరాల పాటు కారాగార శిక్షనూ విధించింది కోర్టు. 

Also Read :  మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!

ఈ కేసులో  వీరిద్దరిని దోషులుగా పేర్కొంటూ జనవరి 17న నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏఎం బషీర్ ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే ఈ కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో గ్రీష్మా తల్లి సింధును కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తనను ప్రేమించిన వ్యక్తిని గ్రీష్మామోసం చేసిందని, అది సమాజానికి మంచి సందేశం ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది.  తీర్పు వెలువరించిన వెంటనే  గ్రీష్మా కోర్టులోనే  కుప్పకూలిపోయింది.  

Also Read :  ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!

గ్రీష్మతో పరిచయం, రిలేషన్‌షిప్

2022కు సంబంధించిన కేసు ఇది. బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్ అయిన షరోన్ రాజ్ (Sharon Raj) కు  కన్యాకుమారిలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటోన్నప్పుడు అతనికి గ్రీష్మతో పరిచయం ఏర్పడింది.  అది కాస్త ప్రేమగా మారి..  ఏడాది పాటు  రిలేషన్‌షిప్‌లో కొనసాగారు. అయితే ఇంట్లో వాళ్లు గ్రీష్మకు వేరే సంబంధం చూడటంతో  రిలేషన్ బ్రేకప్ చేయడానికి షరోన్ రాజ్‌ అంగీకరించలేదు. దీంతో అతన్ని చంపేందుకు గ్రీష్మ తన తల్లి, మేనమామ, తల్లితో కలిసి ప్లాన్ చేసింది. 

Also Read :  World Economic Forum 2025: చంద్రబాబుతో రేవంత్ భేటీ!

షరోన్ రాజ్‌ ను ఇంటికి పిలిచి  కూల్ డ్రింక్ లో  పారాక్వాట్ డైక్లోరైడ్‌ అనే ఆయుర్వేద మందును ఇచ్చింది. ఇది తాగి షరోన్ మరణించాడు.  ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా షరోన్ రాజ్‌ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా..   గ్రీష్మ, నిర్మల్ కుమరన్ నాయర్, ఆమె తల్లి 2022 అక్టోబర్ 31వ తేదీ నేరం చేసినట్లుగా అంగీరించారు. తాజాగా కోర్టు తాజాగా గ్రీష్మకు మరణ శిక్షను ఖరారు చేసింది.

శిక్షపై సంతృప్తి వ్యక్తం చేసిన షారన్ తల్లిదండ్రులు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. నా కుమారుడికి తగిన న్యాయం జరిగింది’ అని అతని తల్లి చెప్పింది. 

Also Read :  రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment