మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్

దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.

author-image
By K Mohan
New Update
kerala rape case

kerala rape case Photograph: (kerala rape case)

అత్యాచార కేసు విచరణలో పోలీసుకు సంచలన విషయాలు తెలిశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రస్తుతం బాదితురాలికి 18 ఏళ్లు ఆమె 13 ఏళ్ల వయసు నుంచి 62 మంది తనను లైంగికంగా వేధించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పతనంతిట్ట జనరల్ హాస్పిటల్‌లో 2024 జనవరిలో యువతిని కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

అథ్లెట్ అయిన దళిత బాలికపైన మొత్తం ఐదు సార్లు బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆమె కోచ్‌లు, సహ క్రీడాకారులు, క్లాస్‌మేట్స్‌ ఉన్నారన్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె తన తండ్రి ఫోన్‌ను ఉపయోగించేవారు. ఆ ఫోన్‌ను, ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు 40 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో సెట్ పోలీసులు ఇప్పటివరకు 44 మందిని అరెస్టు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, కేసుల్లో పేర్కొన్న 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.

నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారి కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసేందుకు కేరళ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని చూస్తున్నారు. వీరితో పాటు మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. గతేడాది 12వ తరగతి చదువుతున్న బాలికను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పరిచయమైన ఓ యువకుడు కేరళ రన్నీలోని రబ్బరు తోటకు తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment