/rtv/media/media_files/2025/03/15/Puub8Le831sCj8GOceqn.jpg)
Bangladesh
Bangladesh nationals : బంగ్లాదేశీయుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ, ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ బండ్లగూడ కేసులో బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ఫ్లాన్తో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడికి తీసుకు వచ్చాక వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే బంగ్లాదేశ్ నుంచి వారిని ఇండియాకు ఎలా తీసుకువస్తున్నారనే విషయంపై ఆరాతీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
ఇటీవల హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను పనికోసం హైదరాబాద్ తీసుకొచ్చి వారితో.. వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణా విషయాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి. కాగా నెల క్రితం పాతబస్తీలో పదుల సంఖ్యలో బంగ్లాదేశ్ అమ్మాయిలు, యువతులతో సెక్స్ రాకెట్ నడుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అక్రమంగా భారత్ లోకి బంగ్లాదేశీయులు ఎలా వస్తున్నారనే దానిపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
హైదరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్న బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా కేసుపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. కొద్ది రోజుల క్రితం బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో నమోదైన యువతుల అక్రమ రవాణా కేసులో ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. బ్యూటిషియన్, టైలరింగ్ శిక్షణ పేరుతో వారు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. అలాగే వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించిన ముఠా వారితో వ్యభిచారం చేయించారు. కొద్దిరోజుల క్రితం పోలీసులకు సమాచారం అందగా.. దాడులు చేసి పలువురిని పట్టుకొని విచారించారు. వ్యభిచారం కేసులో బంగ్లాదేశ్ నుంచి మహిళల అక్రమ రవాణా చేసినట్లు తేలింది.
Also Read: USA: మళ్ళీ వాయిదా పడ్డ ప్రయోగం..సునీతా విలియమ్స్ రాక ఇంకా ఆలస్యం
బంగ్లాదేశీయుల అక్రమ రవాణా విషయంలో ఎన్ఐఏ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇటీవల హైదరాబాద్లోని చాదర్ఘాట్, ఖైరతాబాద్, సనత్నగర్ ప్రాంతాల్లో 20మంది బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేసి విచారించగా..జాబ్ ఆఫర్ల పేరుతో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను ఇండియాకు చెర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
వీరంతా భారత్కు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచారు. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్కు తరలిస్తున్నట్టు గుర్తించింది. దాంతో.. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. హైదరాబాద్లోని ఏజెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. పేటీఎం వాలెట్లోని లక్షా 90వేల రూపాయలను సీజ్ చేసింది.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...