Holi Effect: మసీదులకు పరదాలు.. ఎక్కడో తెలుసా..?

హోలీ పండుగ వేళ ఉత్తరప్రదేశ్ సంభాల్‌లో జామా మసీద్‌తోపాటు 10 మసీదులకు టార్పలిన్ కవర్లు కప్పారు. ఇరు మతాల పెద్దల అంగీకారంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముస్లీంలు నమాజ్ చేసుకునే శుక్రవారం రోజే హోలీ కావడంతో ఇలా చేశారు.

author-image
By K Mohan
New Update
Sambhal Masjid

Sambhal Masjid Photograph: (Sambhal Masjid)

ఇండియాలో హోలీ పండుగు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది హిందువుల పండుగ అయినప్పటికీ అన్నీ మతాలవారు కలిసిమెలిసి చిన్న పెద్దా తారతమ్యం లేకుండా జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ ముస్లీం రంజాన్ పండుగ వేళ వచ్చింది. హిందువులకు హోలీ ఎంతో ప్రసిద్ధో.. ముస్లీంలకు రంజాన్ అంత పవిత్రగా భావిస్తారు. అందులోనూ హోలీ శుక్రవారం రోజు రావడం. శుక్రవారం ముస్లీంలు ఎంతో పవిత్ర రోజుగా నమాజ్ చేస్తారు. మతఘర్షణకు తావులేకుండా ఉత్తరప్రదేశ్‌లో ఇరు మతాల పెద్దలు కలిసి పోలీసుల సమక్షంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. సంభాల్‌లో ఇటీవల కాలంలో అనేక మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలాంటివి రిపీట్ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

Also read: Holi : హోలీ రోజున పోలీసుల ఆంక్షలు.. ఇలా చేస్తే పోలీస్ కేసు ఫైల్

Also read: Lift accident: లిఫ్ట్‌లో మరో పసి ప్రాణం బలి.. మొన్న గంగారం, నేడు సురేందర్

ఇరు మతాల పెద్దలను పిలిచి వారి అంగీకారంలో సంభాల్‌లోని జామా మసీదుతోపాటు 10 మసీదులకు టార్పలిన్ కవర్లు కప్పి రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రంగులు చల్లుతారని భయం ఉంటే హోలీ రోజు ముస్లీంలు బయటకు రావద్దని సూచించారు. సంభాల్ పోలీసు వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. వాటిని సపోర్ట్ చేస్తూ కొందరూ, ఖండిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే శంభాల్‌లో మతకల్లోలాలకు సృష్టిస్తారని అనుమానం ఉన్న 1,015 మందిని యుపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సంభాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వందన మిశ్రా తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేప‌ట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు.

New Update
Jammu and kashmeer MLAs

Jammu and kashmeer MLAs

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఎమ్మెల్యేలు శాసన సభ ఆవరణలో ఘర్షణకు దిగారు. జమ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో తన అసంతృప్తిని వినిపించాలని కొందరు ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. అయితే మూడు రోజుల‌గా అసెంబ్లీ వాయిదాల ప‌ర్వం న‌డుస్తోంది. అయితే ఈరోజు( బుధవారం) కొంద‌రు ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో గొడవ పడ్డారు. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు వాయిదా వేశారు. అసెంబ్లీ లోప‌ల ఆప్ ఎమ్మెల్యే మెహ‌రాజ్ మాలిక్‌, పీడీపీ ఎమ్మెల్యే వ‌హీద్ పారా మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. రెండు వ‌ర్గాలుగా మారిన ఎమ్మెల్యేలు.. ఒక‌రిపై ఒక‌రు దూషించుకున్నారు. 

గ‌త రెండు రోజుల నుంచి కూడా అసెంబ్లీని స్పీక‌ర్ అబ్దుల్ ర‌హీమ్ వాయిదా వేశారు. ఇవాళ కూడా అధికార నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేప‌ట్టారు. ఇటీవ‌ల కేంద్రం ఆమోదించిన వ‌క్ఫ్ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ప్రతిప‌క్ష నేత సునిల్ శ‌ర్మ కూడా వెల్‌లోకి దూసుకెళ్లిన ఎన్‌సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంద‌రు ఎమ్మెల్యేలు స‌భ‌లో ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో ప్రతిష్టంభ‌న ఏర్పడింది. ఆ స‌మ‌యంలో హౌజ్‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు.

Advertisment
Advertisment
Advertisment