/rtv/media/media_files/2026/04/09/sabarimala-2026-04-09-16-41-51.jpg)
Sabarimala judgement proceeds on assumption that men are superior, Centre tells Supreme Court
కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 15 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశం లేకపోవడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించింది. ఈ విధానాన్ని పాటించడం మహిళలపై చూపిస్తున్న వివక్ష కాదని.. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమని తెలిపింది. అంతేకాదు భారత్లో పురుషులు వెళ్లేందుకు అనుమతి లేని ఆలయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెప్పింది.
Also Read: గ్యాంగ్స్టర్ల గుండెల్లో వణుకు: ఒక్కరోజే 501 దాడులు.. 202 మంది అరెస్ట్!
శబరిమల ఆలయంలో మహిళలపై వివక్ష కేసు అంశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనానికి సమర్పించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల గురించి ప్రస్తావించారు. మన దేశంలో పురుషులకు అనుమతి లేని పలు ఆలయాలు కూడా ఉన్నాయని తెలిపారు. దేవి భగవతి గుడిలో కొన్నేళ్లుగా ఈ ఆచారం ఉందన్నారు. కేరళలోనే ఓ ఆలయంలో అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారని చెప్పారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్కు వెళ్లి అమ్మాయిల్లా తయారవుతారన్నారు. అందుకే ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు.
Also Read: 14 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఆ అడవుల్లో ఏం జరుగుతోంది?
ఇదిలాఉండగా శబరిమలలో 10-15 ఏళ్ల మహిళలకు ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018లో సుప్రీంకోర్టు ఎత్తివేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వయసు మధ్యలో ఉన్న మహిళలకు ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని అంటరానితనంగా, ఆర్టికల్ 17ను ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కానీ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు కూడా దాఖలయ్యయి. ఈ క్రమంలోనే ఈ వివాదస్పద అంశాన్ని 2019 నవంబర్లో అప్పటి సీజేఐ రంజన్ గొగొయ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై విస్తృ ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది.
Follow Us