UP Violence: MP ఇంటిపై దాడి.. అడ్డుకున్న పోలీసులను కొట్టిన గ్యాంగ్

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో సవాజ్‌వాదీ MP ఇంటిపై కర్ణిసేనా సభ్యులు దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులను కొట్టారు. బాబర్ ఇండియాలోని రావడానికి రాజ్‌పుత్ రాజు రాణా సంగనే కారణమని చరిత్రలో ఆయన దేశద్రోహి అని ఎంపీ అన్నారు. దీంతో కొందరు రాళ్లు, కర్రలతో ఆందోళనకు దిగారు.

New Update
Rana Sanga Row

Rana Sanga Row Photograph: (Rana Sanga Row)

ఎంపీ ఇంటిపైకి రాళ్లు, కర్రలతో వెళ్లిన ఓ గ్యాంగ్ బుధవారం మూకుముడిగా దాడి చేసింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్ హింస చెలరేగి నెల రోజులు కాకముందే.. ఆగ్రాలో మరో హింస చోటుచేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించడగా ఆందోళనకారులు పోలీసులపైకి తిరగబడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ ఇంటిపై బుధవారం ఓ గ్యాంగ్ దాడి చేసింది. కర్ణి సేన అనే మితవాద సంస్థ సభ్యులు ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని ఆపినప్పుడు పోలీసులపై హింసకు దిగారు. దీంతో అక్కడ లాఠీ ఛార్జ్ చోటుచేసుకుంది.

Also read: Pamban Bridge: ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి బ్రిడ్జ్ ప్రారంభించనున్న మోదీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

16వ శతాబ్దపు నాటి రాజ్‌పుత్ వంశానికి చెందిన రాజు రాణా సంగ బాబర్‌ను భారత దేశానికి ఆహ్వానించినించాడు కాబట్టే ఇక్కడ మొగల్ రాజ్యస్థాపన జరిగిందని సవాజ్‌వాదీ ఎంపీ అన్నారు. రాణా సంగను ఎంపీ రాంజీ లాల్ సమన్ దోశద్రోహి అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు చేసిన వివాదాస్పద ప్రకటనల కారణంగా హింస జరిగింది. బాబర్ జ్ఞాపకాలైన బాబర్‌నామాలో రాసిన దాని ఆధారంగా ఆయన అలా మాట్లాడానని అంటున్నారు. ఎంపీ వ్యాఖ్యలను వ్యతిరేఖిస్తూ కర్ణిసేన సభ్యులు కొందరు కాషాయ జెండాలు, కర్రలతో ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై విరుచుకపడి గాయపరిచారు. ఆందోళనకారులు హింసకు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు విసిరారు, కుర్చీలు విరగ్గొట్టారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో హింస సర్థుమనిగింది.

ఓ నేషనల్ మీడియాతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక చారిత్రక వాస్తవం. ఈ రోజుల్లో భారతీయ ముస్లింలకు బాబర్ DNA ఉందని చెప్పడం సర్వసాధారణమైంది... కానీ నిజం ఏమిటంటే వారు అతన్ని తమ నాయకుడిగా పరిగణించరు. బాబర్ మతంతో రాలేదు.. అతను కత్తితో వచ్చాడు. భారతీయ ముస్లింల ఆదర్శాలు సూఫీ సాధువుల సంప్రదాయాలలో పాతుకుపోయాయి" అని అన్నారు.

Also read: Spam block: 7 లక్షల SIM కార్డ్స్, 83 వేల వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేసిన ఇండియన్ గవర్నమెంట్
" బాబర్‌ను 'విదేశీ ఆక్రమణదారుడు' అని పిలవడం చాలా సులభం.. కానీ అతన్ని ఎవరు ఆహ్వానించారు? 'బాబర్‌నామా'తో సహా రికార్డుల ప్రకారం.. రాణా సంగ బాబర్‌ను ఇబ్రహీం లోడిపై పోరాడటానికి ఆహ్వానించాడు. తరువాత, పరిస్థితి మారిపోయింది మరియు రాణా సంగ స్వయంగా ఖాన్వా యుద్ధంలో బాబర్‌తో పోరాడాడు." అని చరిత్ర గుర్తు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. యూపీలో బీజేపీ, సవాజ్ వాదీ పార్టీల మధ్య వాదనలు జరిగాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment