/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు, గుజరాత్ 4, జార్ఖండ్ 2, మధ్యప్రదేశ్ 3, కర్ణాటక 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్8న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. జూన్ 9న నామినేషన్లు పరిశీలించనున్నారు. జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. పోలింగ్ రోజునే ఫలితాలను వెల్లడించనున్నారు.
Follow Us