మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు.

New Update
KUMBAMELA

వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ వేడుకలు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు.  

Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. అయితే ఈ వేడుకకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా అక్కడికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళా కోసం రైల్వేశాఖ చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం వారణాసి నుంచి రైలు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఇటీవల గంగానదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జిని కూడా పరిశీలించారు. 

Also Read: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఈ కొత్త వంతెనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ గంగానదిపై తమ ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని నిర్మించిందని అశ్విమీ వైష్ణవ్ అన్నారు. ఇక కుంభమేళా కార్యక్రమం ఏర్పాట్ల కోసం భారతీయ రైల్వే గత రెండేళ్లలో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.  

Also Read: యుద్ధంలో 43 వేల మంది సైనికులను కోల్పోయాం, శాంతి కావాలి: జెలెన్స్కీ

Also read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా, అల్లుడు.. 2.5 లక్షల నగదు, బంగారంతో జంప్ అయ్యారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

ఉత్తరప్రదేశ్‌లో అందరూ నొరెళ్లబెట్టే సంఘటన చోటుచేసుకుంది. తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా అల్లుడు ఇద్దరూ జంప్ అయిపోయారు. అలాగే 2.5 లక్షల నగదు, బంగారం కూడా ఎత్తుకెళ్లారు. ఇరు కుటుంబాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. చివరికీ పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. వరుడు దొరకడంతో పెళ్లి సంబంధం ఖాయమైపోయింది. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్తకు మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

Also Read: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మరో 9 తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్లొస్తామని చెప్పి అత్త, అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల నగదు, బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. చివరికి ఆ పారిపోయిన మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

telugu-news | rtv-news | national-news | uttar-pradesh

 

 

Advertisment
Advertisment
Advertisment