రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రూ.46 రైల్వేశాఖే భరిస్తోందన్నారు.

New Update
ASHWINI Vaishnaw

పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పలు కీలక విషయాలను వివరించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతీ సంవత్సరం రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. '' భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోంది. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నాం. 

Also Read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

మిగతా రూ.46 డబ్బులు రైల్వే శాఖే భరిస్తుంది. ఈ రాయితీని అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తింపజేస్తున్నామని'' అశ్వినీ వైష్ణవ్ ప్రశ్తోత్తరాల సమయంలో వెల్లడించారు. అంతేకాదు దేశంలో అత్యంత వేగవంతమైన రైల్వే సేవలపై అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు. భుజ్, అహ్మదాబాద్‌ల మధ్య ఇప్పటికే నమో భారత్‌ రైలు సేవలు ప్రారంభించామని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 359 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. భారత రైల్వేశాఖ అందిస్తున్న సౌకర్యాలపై ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నట్లు భావిస్తున్నామని వివరించారు. 

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

ఇదిలాఉండగా.. దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నారు. బీఈఎంఎల్‌(BEML)తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF) లో ఈ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని  మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవలే పార్లమెంట్‌లో తెలిపారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో వందేభారత్ రైళ్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు పేర్కొన్నారు.   

Also Read: మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి?

Also Read: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment