Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్‌!

సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ పద్ధతులను ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌ పాటించారు. ఆమెనే స్వయంగా ఆవు పేడతో తరగతి గదులను అలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

New Update
delhi

delhi

Delhi: తరగతి గది గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీ  పరిధిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల  ప్రిన్సిపాల్ సిబ్బంది సహాయంతో క్లాస్ రూం గోడలకు ఆవుపేడను పూస్తున్న వీడియో ఒకటి బయటికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Vishwambhara: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్

దీని గురించి ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వస్తల మాట్లాడుతూ.. తాను చేసిన ఆ పని ఓ అధ్యాపకుడి పరిశోధనలో భాగమని, ఈ ప్రాజెక్టు పేరు సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ అధ్యయనం అని చెప్పుకొచ్చారు.ఈ పరిశోధన  పోర్టా క్యాబిన్ లో నిర్వహించడం జరుగుతుందని, ఒక వారం తర్వాత ఈ పరిశోధనకు సంబంధించిన మొత్తం వివరాలను తెలియజేస్తానని పేర్కొన్నారు. అంతేగాక సహజంగా దానిని తాకడం వల్ల ఎటువంటి హాని ఉండదు కాబట్టి ఒక గదికి తానే ఆవు పేడను పూయడం జరిగిందని తెలిపారు. 

Also Read: UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

అంతేగాక పూర్తి వివరాలు తెలియక కొందరు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని, తానే స్వయంగా అధ్యాపకుల బృందానికి సంబంధించిన గ్రూప్ లో వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. కళాశాలలోని సీ బ్లాక్ లోని తరగతి గదులను చల్లగా ఉంచేందుకు దేశీయ పద్దతిని అవలంబిస్తున్నామని, త్వరలోనే ఈ గదులన్ని కొత్త రూపాన్ని సంతరించుకుంటాయని ప్రిన్సిపల్ వివరించారు.

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

Also Read: Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!

delhi university | cow dung | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist letter: భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

సేవ్ కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ లీడర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట లేఖ విడుదలైంది.

New Update

సెంట్రల్ బలగాలు, ఛతీస్‌గఢ్ పోలీసులు సేవ్ కర్రెగుట్టలు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. మూడు రోజులుగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఆ నక్సల్ యాంటీ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ పార్టీ నాయకుడు లేఖ రాశాడు. ఆపరేషన్ నిలిపి.. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదలైంది.

చర్చల కోసం ముందుకు రావాలంటూ లేఖ సారాంశం. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ లేఖలో డిమాండ్
చేశారు. శాంతి చర్చలకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని రూపేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని ఆయన అంటున్నారు. హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్‌ను నెల రోజులు వాయిదా వేయాలన్నారు. 

Also read: Minister Uttam Kumar: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి

చతీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టల అనే అటవి ప్రాంతం ఉంది. మావోయిస్టుల అగ్రనేతలు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దులు జరుగుతున్న సైనిక ఆపరేషన్ వెంటనే ఆపాలని రూపేష్ లేఖలో పేర్కొన్నారు.

Also read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

(letter | maoist-letter | Maoist Letter on Encounter | chattisgarh border | chattisaghad | latest-telugu-news | telangana | Anti-Maoist Operation | Maoists In Mulugu Karre Gutta | Maoists Mulugu Karre Gutta)

Advertisment
Advertisment
Advertisment