PM Modi: ప్రధాని మోదీకి తప్పిన పెను ప్రమాదం..

ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
modi jh

PM Modi Aircraft Hit By Technical Snag

ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని ఢిల్లీ ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల ప్రచారం కోసం.. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం ఝార్ఖండ్‌లో పర్యటించారు. రెండు ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. 

Also Read: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది అత్యాచారమే: బాంబే హైకోర్టు

ర్యాలీ ముగించుకొని ఢిల్లీ తిరిగివెళ్లేందుకు దేవ్‌గఢ్‌ విమానశ్రయానికి చేరుకున్నారు. కానీ ప్రధాని ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం టేకాఫ్ అవ్వలేదు. ప్రస్తుతం అందులోని సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీ నుంచి మరో విమానాన్ని పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో బీజేపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇదే రోజున ఝార్ఖండ్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ కూడా గంటకు పైగా నిలిచిపోయింది. 

Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఆయన హెలికాప్టర్ గొడ్డాలో ఆగిపోయింది. దీంతో రాహుల్‌ గాంధీ షెడ్యూల్‌కు కూడా ఆటంకం ఏర్పడింది. దీనికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇదిలాఉండగా.. ఝార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి దశ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 20న మహారాష్ట్రతో పాటు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Also Read :  Snakes: ఆ దీవిలో అడుగడుగునా మనిషిని మింగేసే పాములు.. కళ్లు మూశారో ఖతం!

Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ వరకు సమయం ఇవ్వాలని ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చామని.. మధ్యలోనే వెళ్లిపోమంటున్నారని ఆవేదన చెందాడు. చికిత్సకు ఇప్పటికే రూ.కోటి ఖర్చు అయ్యిందన్నారు.

New Update
Surgeries

Surgeries

తన ఇద్దరు పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పుట్టుక నుంచి తన ఇద్దరు పిల్లలు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చారు. ఇప్పుడు పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ కాకుండానే మధ్యలో వెళ్లాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

కొంత సమయం ఇవ్వాలని..

చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని ప్రభుత్వాలను కోరాడు. ఢిల్లీలో అధునాతన చికిత్స ఉందని, అందుకే చికిత్సకు ఇండియాకు వచ్చినట్లు తెలిపాడు. ఇంకో వారం రోజుల్లో శస్త్రచికిత్స జరగనుంది. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పిల్లల వైద్యానికి రూ.కోటి ఖర్చు అయ్యిందని, ఇప్పుడు మధ్యలోనే చికిత్స ఆపేస్తే.. పిల్లల ప్రాణాలకే ప్రమాదమని తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఇంకో రెండు వారాల సమయం ఇస్తే చికిత్స అన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోతామని తండ్రి ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment