PM Modi: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్న గిర్‌ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడున్న జంతువులను వీక్షించారు. అలాగే చిరుత, సింహం పిల్లలకు పాలు పట్టించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
PM Modi Inaugurates Wildlife Centre At Vantara

PM Modi Inaugurates Wildlife Centre At Vantara

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్న గిర్‌ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన వంతారాను ఆయన ప్రారంభించారు. సింహాలను చూసేందుకు సఫారీ చేశారు. కెమెరాతో వాటి ఫొటోలను తీశారు. అలాగే వన్యప్రాణుల ఆస్పత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలతో ఉన్న పశువైద్యశాలను కూడా సందర్శించారు.   

Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..

కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ,  వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ వంటి అనేక విభాగాలను పరిశీలించారు. తెల్ల సింహం పిల్ల, ఆసియాటిక్ సింహం పిల్లలు, అరుదైన జాతి చిరుతపులి పిల్ల, కారకల్‌ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపారు. అంతేకాదు వాటికి పాలు కూడా పట్టించారు. అలాగే అక్కడ చిరుత, ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, ఏనుగులు, పాములు, మొసళ్లు వంటి జంతువులను వీక్షించారు.

Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ  షామా మొహమ్మద్?

ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏనుగుల ఆస్పత్రిని కూడా ప్రధాని మోదీ సందర్శించారు. జంతువులకు సేవ చేస్తున్న వైద్యులు, కార్మికులతో ఆయన సంభాషించారు. అయితే వంతారాలో 2000లకు పైగా జాతులు అలాగే 1.5 లక్షలకు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న జంతువులు ఉన్నాయి. 

Also Read: మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment