Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరామ నవమి సందర్భంగా, అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లాకు సూర్య తిలకం జరిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో రామ్ లల్లా నుదుటిపై 'సూర్య తిలకం' ప్రకాశించింది.

New Update
 Ram Mandir Surya Tilak Ceremony

Ram Mandir Surya Tilak Ceremony

Ram Navami 2025:  ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరామ నవమి సందర్భంగా, అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లాకు సూర్య తిలకం జరిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా నుదుటిపై 'సూర్య తిలకం' ప్రకాశించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణం రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడి దివ్యమైన తిలకంగా ఏర్పడింది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామ నవమి ఇది. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అయోధ్య ఆలయంలో గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకం వలే కన్పిస్తోంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు దీనిని నిర్మించారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ప్రతి శ్రీరామ నవమి రోజున..


ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌ టీత్‌ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని అత్యంత కచ్చితత్వంతో గణించారు. 


ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అంతకుముందు అయోధ్య, సంభాల్‌లోని ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్న దేవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీగా వస్తున్న యాత్రికుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాజ్‌కరణ్ నయ్యర్ ANIతో మాట్లాడుతూ, "రామ్ నవమి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తున్నారు. మేము ప్రాంతాలను వేర్వేరు జోన్లుగా విభజించాము. రద్దీని నియంత్రించడానికి, భద్రతా ప్రయోజనాల కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

శ్రీ రామ్ జన్మభూమి ఆలయంలో ఏర్పాట్ల గురించి అదనపు ఎస్పీ మధుబన్ సింగ్ మాట్లాడుతూ...రామ్ నవమి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేయడానికి వస్తారు... భక్తుల భద్రత కోసం పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు... సరైన పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు" అని ఆయన చెప్పారు.సంభల్‌లో కూడా దేవాలయాలు, సమీప ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. అధికారులు నిఘా వ్యవస్థల ద్వారా పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ 'రామ్ నవమి' శుభాకాంక్షలు తెలుపుతూ దేశ ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహం రావాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీ Xలో.. "రామ్ నవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీరాముని జన్మదినోత్సవం సందర్భంగా ఈ పవిత్రమైన రోజు మీ జీవితాల్లో కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. బలమైన, సుసంపన్నమైన, సమర్థవంతమైన భారతదేశ సంకల్పానికి నిరంతరం కొత్త శక్తిని అందిస్తుంది. జై శ్రీరామ్!" అని రాసుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment