అమిత్‌ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

New Update
Amit shah ponnam

పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కూడా పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించిన అతిత్‌ షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.  

Also Read: పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు

'' భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తే బీఆర్ఎస్‌ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. విపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని, అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే మాట ఎందుకు చెప్పడం లేదు. అమిత్‌ షాపై తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాయి. అంబేద్కర్‌ను అవమాన పరిచేలా దేవుడిని మొక్కితే ముక్తి దొరుకుతుందని చెప్పడం జాతిని అవమానపరిచ్చినట్టే. 

Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

బీజేపీ స్టాండ్ అంబేద్కర్‌పై ఏముందో కిషన్ రెడ్డి, బండి సంజయ్, మనస్మృతి వాదులు చెప్పాలి. బీఆర్ఎస్‌ పార్టీ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలి. అమిత్‌షాను వెంటనే భర్తరఫ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టాలని'' మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా.. అమిత్‌ షా కూడా తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. నేను మాట్లాడిన స్పీచ్‌ ఫుల్‌ వీడియో చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్‌ను అవమానించిందంటూ కౌంటర్లు వేశారు. 

Also Read: ఛీ ఛీ వీడేం డైరెక్టర్.. మహిళల బాత్రూంలో స్పై కెమెరా పెట్టి మరీ!

Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment