Maoist: పోలీసులపై దాడులు చేసేందుకు మవోయిస్టుల బిగ్ స్కెచ్.. హిడ్మాకు బదులు పతిరాం!

మవోయిస్టు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిడ్మాను తొలగించి ఝార్ఝండ్‌కు చెందిన పతిరాం మాంఝీకి కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పతిరాంపై కోటి రివార్డు ఉండగా దాడులు చేయడంలో దిట్టగా పేరుగాంచాడు.

New Update
maoist hidma

Maoist party key decision on Central Committee leadership

Maoist: మవోయిస్టు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కీలక నేత హిడ్మాను కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా హిడ్మా స్థానంలో ఝార్ఝండ్‌కు చెందిన పతిరాం మాంఝీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.  హిడ్మా తరహాలోనే పతిరాం దాడులు చేయడంలో దిట్టగా పేరుగాంచారు. దీంతో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో పతిరాంకు  బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీఎల్జీఏ మొదటి బెటాలియన్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉండగా పతిరాంపై కూడా కోటి రివార్డు ప్రకటించారు పోలీసులు.  

దండకారణ్యంలో పోలీసు క్యాంపులు..

కేంద్ర బలగాల వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది. వేల మంది సైన్యంతో మావోయిస్టు అడ్డా అయిన దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి దొరికిన వారిని దొరికినట్లు కాల్చేస్తుంది. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతుండగా పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అలాగే కోవర్టులు కూడా పెరిగిపోవడంతో ఎవరిని నమ్మాలో తెలియక తలలు పట్టుకుంటున్న మావోయిస్టులు పలు కీల మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అగ్రనేత హిడ్మాను సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Haryana: హరియాణాలో కాలువలోకి దూసుకెళ్ళిన జీపు..9 మంది మృతి

సుక్మా దాడి తర్వాత కీలక బాధ్యతలు..

ఇటీవల వరుస పరిణామాలతో హిడ్మాను తొలగించాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు పార్టీ.. అతని స్థానంలో మరొకరికి దండకారణ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హిడ్మాను తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే హిడ్మాను తప్పించారా? లేక ఎన్ కౌంటర్లను అడ్డుకోవడంతో హిడ్మా ఫెయిల్ అయ్యారా? లేక పోలీసుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా ఒకరు కాగా.. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు కీలక బాధ్యతలు అప్పగించింది మావోయిస్టు పార్టీ. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment