Maharashtra: షాకింగ్.. మంత్రికి రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా

మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత, వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావు కొకరేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల క్రితం మోసానికి పాల్పడిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది.

New Update
Maharashtra minister Manikrao Kokate gets two years jail in cheating-forgery case

Maharashtra minister Manikrao Kokate gets two years jail in cheating-forgery case

మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత, వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావు కొకరేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల క్రితం మోసానికి పాల్పడిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. మంత్రితో పాటు ఆయన సోదరుడికీ కూడా జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ నాసిక్‌ కోర్టు తీర్పునిచ్చింది. అక్రమాలు చేసి, ఫేక్ పత్రాలు సృష్టించి ప్రభుత్వ కోటాలో ఫ్లాట్‌లు పొందారని మాజీ మంత్రి దివంగత టీఎస్‌ డిఘాలో అప్పట్లోనే వీళ్లిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read:  రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా?

దీంతో వాళ్లపై కేసు కూడా నమోదైంది. 1995 నాటి ఈ కేసుపై విచారణ జరుగుతూనే వస్తుంది. సాక్షులను నాసిక్‌ జిల్లా సెషన్స్ కోర్టు కోకఠే సోదరులను గురువారం దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలాఉండగా. కోర్టు విచారణకు హాజరైన మంత్రి మాణిక్‌ రావు దీనిపై మాట్లాడారు. 

Also Read: కర్మ వెంటాడడం అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ వీడియో!

కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారణ చేసినట్లు అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. తమకు సొంతంగా ఫ్లాట్లు లేవని.. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెబుతూ ఫేక్‌ పత్రాలు సృష్టించి ప్రభుత్వ కోటాలో ఫ్లాట్లు పొందినట్లు పేర్కొన్నారు. 

Also Read: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లి పేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!

Also Read: ఏక్‌నాథ్ షిండేను చంపేస్తాం, బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment