LeT Member: భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే

లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఇండియాకు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన అతడిని ఎట్టకేలకు రువాండాలో గుర్తించారు. నవంబర్‌ 27న ఎన్‌ఐఏ, సీబీఐ నిందితుడిని ఇంటర్‌పోల్‌ సహకారంతో ఇండియాకు రప్పించింది.

New Update
ruvanda

పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఇండియాకు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన అతడిని ఎట్టకేలకు రువాండాలో గుర్తించారు. ఇంటర్‌పోల్‌ సహకారంతో తాజాగా అతడిని సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారత్‌కు రప్పించాయి. దీనికి సంబంధించిన విషయాలను అధికారులు గురువారం వెల్లడించారు.    

Also Read: ప్రధాని మోదీని చంపుతామంటూ.. ముంబాయి పోలీసులకు బెదిరింపు కాల్స్..

Lashkar-e-Taiba

ఇక వివరాల్లోకి వెళ్తే.. లష్కరే తోయిబా ముఠాకు చెందిన సల్మాన్ రెహ్మాన్‌ ఖాన్ బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. బెంగళూరులో జైళ్లపై జరిగిన ఉగ్రదాడులకు.. అతడు పేలుడు పదార్థాలను, ఆయుధాలను సరఫరా చేశాడనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఈ కేసుపై రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ.. రెహ్మాన్ విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది. ఆ తర్వాత సీబీఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు 2న అతడిపై రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసింది. 

Also Read: బీజేపీకే సగం మంత్రిత్వ శాఖలు.. షిండేకు ఆ పదవి ఖరారు !

అతడి ఆచూకి కనిపెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. చివరికి అతడు రువాండాలో ఉన్నట్లు గుర్తించింది. దీంతో నవంబర్ 27న కిగాలీ అనే ప్రాంతంలో ఆ నిందుతుడు అరెస్టయ్యాడు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థ.. ఇంటర్‌పోల్‌ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించింది. గురువారం అతడు ఇండియాకు రాగా.. ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు విచారిస్తోంది. 

Also Read: పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి

Also Read: పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment