Lalit modi: మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్‌ రిమ్ బౌరీని పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు ప్రేమగా మారినందుకు తాను అదృష్టవంతుడినన్నారు.

New Update
lait modi

Lalit Modi introduced new girlfriend

Lalit modi: IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్‌ను పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కొంతకాలంగా బాలీవుడ్‌ నటి, విశ్వసుందరి సుస్మితా సేన్‌తో ప్రేమయాణం నడిపిన మోదీ.. తాజాగా మరో యంగ్ లేడీతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు.

రెండుసార్లు అదృష్టవంతుడిని..

ఈ మేరకు '25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు ప్రేమగా మారింది. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా ఒకసారే అదృష్టవంతులు అవుతారు. కానీ నేను రెండుసార్లు అదృష్టవంతుడిని. నా జీవితంలో రెండుసార్లు అద్భుతం జరిగింది. మీ అందరికీ కూడా జరుగుతుందని ఆశిస్తున్నా. అందరికీ #happyvalentinesday' అంటూ ఆమెతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా జనాలు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. 'వీడు మగాడ్రా బుజ్జీ. అదృష్టమంటే ఇలా ఉండాలి. ఆటగాడు' అంటూ పొగిడేస్తున్నారు. 

నిన్ను చాలా ప్రేమిస్తున్నా..

ఈ అందగత్తె పేరు రిమ్ బౌరీ. లెబనాన్‌లో స్థిరపడిన ఆమె ఇండిపెండెట్ కన్సల్టెంట్ అండ్ మార్కెటింగ్ నేపథ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రిచ్‌మండ్ నుండి మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలలో నిష్ణాతులు. కాగా లలిత్ మోదీ తన ప్రియురాలు రీమాను ఇన్‌స్టాగ్రామ్‌లో 25 ఏళ్లుగా ఫాలో అవుతున్నారట. అయితే లలిత్ మోదీ ప్రేమపై స్పందించిన రిమ్ బౌరీ.. 'నిన్ను చాలా ప్రేమిస్తున్నాను' అంటూ తన ప్రేమను చాటుకుంది.

ఇది కూడా చదవండి: BIG BREAKING: ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్!

ఇదిలా ఉంటే.. లిత్ మోడీ సతీమణి మిలాన్‌ మోడీ 2018లో క్యాన్సర్‌తో చనిపోయారు. ఇక మనీలాండరింగ్ కేసులో 2010లో దేశం విడిచి వెళ్లిన లలిత్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. 2022లో సుస్మితా సేన్‌తో డేటింగ్‌ చేసిన ఆయన పెళ్లి కూడా చేసుకోబుతున్నట్లు చెప్పాడు. కానీ వీరి బంధం మధ్యలోనే తెగిపోయింది. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేగింది. 2023లో సుష్మితా సేన్ లలిత్ మోడీతో తన స్వల్పకాలిక ప్రేమ గురించి ఆసక్తికర వ్యా్ఖ్యలు చేసింది. ఇది మరో దశ. అయినప్పటికీ ప్రజలు తనను 'గోల్డ్ డిగ్గర్' అని పిలవడం ఆనందమేనని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: MP Highcourt: పరాయి పురుషుడితో అలా చేస్తే అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

#lalit-modi #telugu-news-today #telugu-news #latest-telugu-news #valentines-day #rtv telugu news #love
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌...

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment