సిద్ధరామయ్యకు బిగ్‌ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది.

author-image
By B Aravind
New Update
Siddaramiah

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విచారణపై మూడు నెలల్లోగా నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (MUDA) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో హాట్‌ టాపిక్‌గా మారింది. స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటంబ సభ్యులు లాభాలు పొందారని, అలాగే ముఖ్యమంత్రి అధికారాన్ని సైతం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. టి.జె అబ్రహం అనే సామాజిక కార్యకర్త ఈ వ్యవహారానికి సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 

Also Read: ''నన్ను క్షమించండి'' రైతు చట్టాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కంగనా

ఈ నేపథ్యంలో మూడా స్కామ్‌పై వస్తున్న ఆరోపణల్లో సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు కర్ణాటక గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ తనపై విచారణకు పర్మిషన్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే స్పెషల్‌ కోర్టు ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, తన భార్యతో పాటు ఇతరులపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశించింది. 

Also Read: లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. ఏఆర్ డెయిరీపై కేసు!

మరోవైపు ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఈ కేసులో పోరాడతానని.. దేనికి భయపడనని పేర్కొన్నారు. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

భారత బాక్సర్ మేరీకోమ్ వీడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే మేరీకోమ్ దంపతులను దూరమయ్యేలా చేసిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ విడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు మేరీకోమ్ దగ్గరే ఉంటున్నారు.

New Update
Mary Kom: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్‌ మేరీ కోమ్..

Mary kom

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ త్వరలోనే ఆమె దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నులుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విడాకుల గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే వారిని దూరమయ్యేలా చేసిందంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

బాక్సర్ మేరీ కోమ్ 2005 సంవత్సరంలో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ముగ్గురు అబ్బాయిలు కాగా ఒకరు అమ్మాయి. అయితే ఇంతకాలం హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలైనట్లు సమాచారం. ముఖ్యంగా వీరిద్దరూ త్వరలోనే విడిపోబోతున్నారని, అధికారికంగా ఈ విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. 

నలుగురు పిల్లలతో మేరీకోమ్ విడిగా..

ప్రస్తుతం మేరీకోమ్ తన భర్తతో కలిసి ఉండట్లేదని.. ఇటీవలే తన నలుగురు పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌లోని పుట్టింటికి వెళ్లిపోయిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆమె భర్త అకా ఓన్లర్ మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలే అని అంతా భావిస్తున్నారు. అసలు వీరికి, ఆ ఎన్నికలు సంబంధం ఏంటా అనే అనుమానం వస్తోందా.. ఉందండి.. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త అకా ఓన్లర్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం కోం 2 నుంచి 3 కోట్ల రూపాయలకు వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. 

ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఓడిపోవడంతో.. మేరీకోమ్ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. అవి తట్టుకోలేకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అకా ఓన్లర్‌కు ముందు నుంచే ఇష్టం లేదని.. కానీ మేరీకోమ్‌యే బలవంత పెట్టి ఆయనతో పోటీ చేయించిందని తెలుస్తోంది. ఆమే బలవంతం పెట్టి రంగంలోకి దింపి.. ఓడిపోయిన తర్వాత భర్తతో గొడవ పడిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మేరీకోమ్ కోసం ఆయన భర్త ఎంతో చేశారని.. ఆయన ఫుట్‌బాల్ కెరియర్‌ను కూడా పిల్లల బాగోగుల కోసం వదులుకున్నట్లు రాసుకొస్తున్నాయి. 

మరోవైపు మేరీకోమ్‌కు మరో మహిళా బాక్సర్ భర్తతో స్నేహం ఉందని.. దాని వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి.ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియకపోయినప్పటికీ.. వీరి విడాకులు మాత్రం ఖాయం అంటున్నారు.

today-latest-news-in-telugu | boxer | mary-kom

Also Read: TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Advertisment
Advertisment
Advertisment