Muslims: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. భగ్గుమన్న బీజేపీ

ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపింది.

New Update
Karnataka Congress government approves 4% reservation for Muslims in government contracts

Karnataka Congress government approves 4% reservation for Muslims in government contracts

ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్ట సవరణ చేసింది. అయితే సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంపై దాడి అంటూ విమర్శించారు. 

Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!

అయితే ప్రభుత్వ నిర్ణయంతో కేటీపీపీ చట్టం ప్రకారం కేబగిరీ 2బీ కింద ఉన్న ముస్లిం కాంట్రాక్టర్లు దాదాపు రెండు కోట్ల వరకు ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు కానున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో సవరణ బిల్లును ప్రవేశపెట్టాక.. ముస్లిం కాంట్రాక్టర్ల కోటాను అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పింది.  

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

ఇదిలాఉండగా కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించింది. ఇ-పాలనలో 2024 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటకకు బంగారు పథకం వచ్చింది. దీనిపై సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఇ-పాలనలో ప్రతీసారి కర్ణాటక సర్కార్‌ మంచి పనితీరు చూపిస్తోందని అన్నారు. బంగారు పతకాన్ని దక్కించుకునేలా మెరుగైన మెరుగైన పనితీరును చూపిస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment