గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేశారని స్పష్టం చేసింది.

New Update
Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారని.. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. తోటి స్నేహితులు ఒక అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లో గ్రౌండ్‌కి, మేడ మీదకి తీసుకెళ్లారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారు. సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చింది. ఈ వీడియో బయటకు వెళ్లడంతో దీన్ని తప్పుగా చిత్రీకరించారు. ఇలా చేసిన విద్యార్థులకు వర్సిటీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసిందని'' తెలిపారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఇదిలాఉండగా.. జిందాల్ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడున్న సిబ్బంది ఆ సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. దీంతో తాజాగా దీనిపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం ఇదంతా ప్రాంక్ అని స్పష్టం చేసింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

 telugu-news | rtv-news | haryana | national-news 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!

పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
Kupwara

Kupwara

జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పహల్గామ్ ఘటన మరువకముందే మరో దాడికి పాల్పడ్డారు. కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను టెర్రరిస్టులు టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాల్పుల గురించి సమాచారం అందిన తర్వాత వెంటనే భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ముగ్గురు ఉగ్రవాద సహచరులు అరెస్టు

ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందడంతో భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. గురువారం బండిపోరాలోని ఒక చెక్‌పాయింట్ వద్ద పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT)తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేశారు. కాగా పహల్గామ్ ఘటనలో 25 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా బాంబు దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో పహల్గామ్ దాడి ఒకటిగా అభివర్ణించబడుతోంది, ఈ దాడిలో 40 మంది CRPF సిబ్బంది మరణించారు.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇది ఒకటి.

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు