SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

ఎప్పుడూ లేనంతగా భారతీయులు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారుట. సంపాదించిన డబ్బులను సేవ్ చేసుకుంటున్నారు. ఎస్బీఐ నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయులు బాగా పొదుపు చేస్తున్నారని తేలింది. అందుకే పొదుపులో వరల్డ్‌లో నాల్గవ స్థానంలో ఇండియా ఉందని చెబుతోంది. 

New Update
sbi report

Savings

ఎస్బీఐ Ecowrap series సిరీస్ లో భాగంగా భారతీయుల పొదుపు మీద రీసెర్చ్ చేసింది. ఇందులో భారతీయులు ఈ మధ్యన ఎక్కువగా పొదుపు చేస్తున్నారని తేలింది. ఈ రిపర్ట్ ప్రకారం ప్రపంచ పొదుపు శాతం 28.2 శాతాన్ని మించి ఇండియా 30.2 శాతం పొదుపు రేటుతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచ దేశాలలో అత్యధికంగా పొదుపు చేస్తున్నవారు మాత్రం చైనా ప్రజలు. ఈ దేశం 46.6 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో రెండు, మూడు స్థానాలలో ఇండోనేషియా (38.1%), రష్యా  (31.7%) ఉన్నాయి. 

పెరిగిన బ్యాంక్ అకౌంట్లు..

ఇండియన్స్‌లో పొదుపు సామర్థ్యం బాగా పెరిగిందని చెబుతోంది ఎస్బీఐ. ప్రస్తుతం 80 శాతం ఇండియన్స్ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటమే కాకుండా.. పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారుట.  2011లో 50 శాతం అకౌంట్లు కలిగి ఉండగా ప్రస్తుతం 80 శాతం అకౌంట్లకు పెగటమే ఇందుకు నిదర్శమని అంటోంది. అయితే ఓన్లీ ఈ బ్యాంకు అకౌంట్ల ద్వారా మాత్రమే అంచనా వేయలేదని...చాలా రకాలుగా పరిశీలించాకనే రిపోర్ట్ ఇచ్చామని చెబుతోంది ఎస్బీఐ. 

ఎలా దాస్తున్నారు...

ప్రస్తుతం భారతీయుల పొదుపు విధానంలో కూడా చాఆ మార్పులు వస్తున్నాయని తేలింది. కొంతకాలం క్రితం వరకూ క్యాష్ లేదా వెండి, బంగారం రూపలో తమ దగ్గర ఉన్న ఆస్తిని దాచుకునేవారు. కానీ ఇప్పుడు ఫైనాన్సింగ్‌లో భారతీయులకు అవగాహన పెరింగింది. దానిని ఉపయోగించుకుని మ్యూచువ్ ఫండ్స్‌, స్టాక్స్, సిప్‌లు లాంట వాటిల్లో తమ నగదును పెడుతున్నారని చెబుతోంది ఎస్బీఐ. 2018 లో 4.8 కోట్ల SIP అకౌంట్లకు భారత్ చేరుకుందంటే ఫైనాన్షియల్ నాలెడ్జి మనవాళ్ళల్లో ఎంత పెరిగిందో చెప్పవచ్చని అంటున్నారు. గతంలో స్టాక్స్, డిబెంచర్లలో మన ఇండియన్స్ తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సేవింగ్, ఇన్వెస్ట్ మెంట్ ఆలోచనలు మారుతున్నాయి. స్టాక్స్, డిబెంచెర్స్ లలో పదేళ్ల క్రితం మన జీడీపీలో 0.2 శాతం మాత్రమే ఉండగా.. 2024 ఆర్థిక సంవత్సరానికి 1 శాతానికి చేరుకోవడమే మనవాళ్ల పొదుపు సామర్థ్యం పెరిగింది అనడానికి నిదర్శనం అని ఎస్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. 

Also Read: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment