బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి స్కూటీపై ఉండగా నలుగురు ముస్లిం యువకులు వాళ్లని వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Hindu Man, Burqa-Clad Woman Harassed, Verbally Abused By Muslim Men In Bengaluru, 4 Arrested

Hindu Man, Burqa-Clad Woman Harassed, Verbally Abused By Muslim Men In Bengaluru, 4 Arrested


కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి స్కూటీపై ఉండగా నలుగురు ముస్లిం యువకులు వాళ్లని వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 9న చంద్రా లే అవుట్ ప్రాంతంలో పార్క్ చేసిన స్కూటీపై ఓ హిందూ యువకుడు, బుర్ఖా ధరించిన ముస్లిం యువతి కూర్చున్నారు. ఇది చూసిన నలుగురు ముస్లిం యువకులు వాళ్ల వద్దకు వచ్చారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

ఆ యువతి, యువకుడు వేర్వేరు మతాలకు చెందడంతో వాళ్లు కలిసి ఉండటాన్ని నిలదీశారు. బుర్ఖా ధరించిన నువ్వు హిందూ అబ్బాయితో ఎందుకు బైక్‌పై కూర్చున్నావు అంటూ ఆగ్రహించారు. నీకు సిగ్గు లేదా ? కుటుంబ గౌరవం లేదా ? అంటూ తీవ్రంగా తిట్టారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఫొన్ నెంబర్ ఇవ్వాలంటూ ఆ ముస్లిం మహిళను బెదిరించారు. 
 
అయితే ఆ వ్యక్తి తన క్లాస్‌మేట్ అని ఆమె చెప్పింది. తన ఫ్యామిలీ వాళ్ల ఫోన్‌ నెంబర్ ఎందుకు ఇవ్వాలంటూ అడిగింది. వేరే మతానికి చెందిన ఆ మహిళను ఎందుకు కలుస్తున్నావని ఆ యువకుడిని కూడా వాళ్లు నిలదీశారు. అతడిపై దాడి చేసేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

చివరికి ఈ ఘటనపై స్పందించిన ఆ ముస్లిం అమ్మాయి.. తమను వేధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లని మొహ్సిన్, మన్సూర్, అఫ్రిది, వసీం ఖాన్‌గా గుర్తించారు. మళ్లీ ఇలాంటి మోరల్ పోలిసింగ్ చేష్టలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు వాళ్లకి హెచ్చరించారు.  

Also Read: బిగ్ బ్రేకింగ్...తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారు

rtv-news | hindu-muslim | national-news 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ టెర్రర్ అటాక్.. లైవ్ అప్‌డేట్స్

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

author-image
By Krishna
New Update
terror-attack

terror-attack

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

  • Apr 27, 2025 15:35 IST

    పహల్గాం ఉగ్రదాడిని సపోర్ట్‌ చేస్తూ పోస్టులు.. 19 మంది అరెస్టు

    పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇలా పోస్టులు చేసిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

    Student, Retired Teachers, Lawyer Among 19 Arrested For Remarks On J&K Attack
    Student, Retired Teachers, Lawyer Among 19 Arrested For Remarks On J&K Attack

     



  • Apr 27, 2025 14:50 IST

    కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

    పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ బృందాలు పహల్గాంలో దర్యా్ప్తు ప్రారంభించాయి.

    NIA takes Pahalgam terror attack Probe
    NIA takes Pahalgam terror attack Probe

     



  • Apr 27, 2025 14:50 IST

    ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

    ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. మొత్తం 5వేల మంది పాకిస్తానీలు ఢిల్లీలో నివసిస్తున్నారని.. వారిని వెంటనే పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.

    Pakistanis in Delhi



  • Apr 27, 2025 14:49 IST

    లొంగిపో బిడ్డా.. ఉగ్రవాదిని వేడుకున్న తల్లి.. పరీక్ష రాసేందుకు వెళ్లి!

    పహల్గాం అటాక్‌లో భాగమైన ఉగ్రవాది ఆదిల్‌ను లొంగిపోవాలంటూ తన తల్లి షాజా బానో వేడుకుంటోంది. 2018లో ఇంటినుంచి పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. తన బిడ్డ అమాయకుడని, తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కన్నీటిపర్యంతమైంది. 

    pehalgam
    pehalgam Photograph: (pehalgam)

     



  • Apr 27, 2025 14:47 IST

    తల్లి ఇండియా.. పసి పిల్లలు పాకిస్థాన్: అటారి సరిహద్దులో కన్నీటి కథ!

    పహల్గాం అటాక్ నేపథ్యంలో అటారి సరిహద్దు వద్ద ఓ భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. పాక్ పౌరులు తరలివెళ్తుండగా ఓ తల్లికి ఇండియా, ఆమె ఇద్దరు పిల్లలకు పాక్ పాస్ పోర్టులున్నాయి. దీంతో తల్లిని వీడలేక పిల్లలు, పిల్లలను వీడలేక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

    pak ind
    pak ind Photograph: (pak ind)

     



  • Apr 27, 2025 14:02 IST

    రంగంలోకి ఇండియన్ నేవీ



  • Apr 27, 2025 10:26 IST

    మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

    ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు. 



  • Apr 27, 2025 10:08 IST

     పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న యావత్ ప్రపంచం

    భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న అన్ని దేశాలు
    ఉగ్రదాడిని తప్పుబట్టిన అమెరికాకు చెందిన FBI
    భారత్‌కు అండగా ఉంటామన్న FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్
    టెర్రరిస్టులపై పోరులో తాము కలిసి వస్తామన్న కశ్యప్ పటేల్
    ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగులుతున్న పాకిస్తాన్
    ఇప్పటికే భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్‌ మొసాద్‌ టీం?



  • Apr 27, 2025 08:49 IST

    కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్

    రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు
    కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు  మనవాళ్లే - విజయ్ దేవరకొండ
    ప్రాపర్‌ ఎడ్యుకేషన్‌ లేక ఇలా బిహేవ్‌ చేస్తున్నారు - విజయ్ దేవరకొండ
    ఆ నాకొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి  - విజయ్ దేవరకొండ
    వాళ్ల బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి - విజయ్ దేవరకొండ 
    వాళ్లకే  విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు- విజయ్‌ దేవరకొండ

     ఆ నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్



  • Apr 27, 2025 08:48 IST

    భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు

    LoC వెంట సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు
    అట్టారీ బోర్డర్‌లో గ్రామాలను ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
    సరిహద్దు పొలాల వద్దకు ప్రజల వెళ్లొద్దంటూ ఆదేశాలు
    సురక్షిత ప్రాంతాల తరలింపుకు ఏర్పాట్లు
    పాకిస్తాన్‌పై ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇండియా
    2 రోజుల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం?



  • Apr 27, 2025 08:20 IST

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    టెర్రరిస్టుల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆర్మీ

    తాజాగా మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ

    కుర్పారాలోని ఫరూఖ్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిద

    48 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం.. 



  • Apr 27, 2025 08:18 IST

    పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

    ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు. 



  • Apr 27, 2025 08:15 IST

    జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!

    పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Advertisment
Advertisment
Advertisment