నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్..

మధ్యప్రదేశ్‌లో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన పరుశురామ్‌ కల్యాణ్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
new born baby and Brahmin Community Chief

new born baby and Brahmin Community Chief

మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణ కమ్యూనిటీ తమ జనాభాను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ఆ కమ్యూనిటీకి చెందిన పరుశురామ్‌ కల్యాణ్ బోర్టు ప్రకటన చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని పరశురామ్ కల్యాణ్ బోర్డు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే బ్రాహ్మణ కుటుంబాల సంఖ్య తగ్గిపోతుండటంతో ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఈ బోర్డు ప్రకటన చేసింది. 

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రంలో పరుశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా మాట్లాడారు. మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇది సమస్యాత్మకంగా మారుతోందని.. భవిష్యత్‌ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. 

Also Read: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నాని చెప్పారు. నలుగురు పిల్లల్ని కనే మహిళకు పరుశురామ్ కల్యాణ్ బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు తాను బోర్డు అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోయాకా కూడా ఈ నజరానా అవార్డు కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 

Also Read: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ

Also Read: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment