Crime News: బాలికతో ఆన్‌లైన్‌ పరిచయం.. బామ్మ ఖాతాలో రూ.80 లక్షలు కాజేసిన 10వ తరగతి స్టూడెంట్స్!

గురుగ్రామ్‌లో ఊహించని స్కామ్ చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలిక తన బామ్మ అకౌంట్‌లో రూ.80లక్షలు ఉన్నాయని స్నేహితురాలికి చెప్పింది. ఆ విషయం విన్న 10వ తరగతి విద్యార్థి తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్లాన్ వేశాడు. మొత్తంగా డబ్బులు కాజేసి దొరికిపోయారు.

New Update
Gurugram Teen Blackmailed Rs.80 Lakh Scam

Gurugram Teen Blackmailed Rs.80 Lakh Scam

‘‘మా అమ్మమ్మ భూమి అమ్మింది. దాంతో ఏకంగా రూ.80 లక్షలు వచ్చాయి. వాటిని మా అమ్మమ్మ అకౌంట్లోనే ఉన్నాయి.’’ ఈ మాటలను 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక తన స్నేహితురాలికి చెప్పింది. అది విన్న 10వ తరగతి స్టూడెంట్ ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆన్‌లైన్‌లో ఆ బాలికతో స్నేహం పెంచుకున్నాడు. 

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

తర్వాత ఆ బాలిక అమ్మమ్మ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం అతడు కాజేశాడు. ఈ విషయం స్కూల్ టీచర్‌కు తెలియడంతో పోలీసులకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇంతకీ ఏమని చెప్పి డబ్బులు దోచారు?, ఈ విషయం స్కూల్ టీచర్‌కు ఎలా తెలిసింది? అనే పూర్తి విషయానికొస్తే.. 

Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

బామ్మ అకౌంట్లో రూ.80 లక్షలు

గురుగ్రామ్‌కు చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఒకరోజు స్కూల్‌లో తన స్నేహితురాలితో.. తాము భూమిని అమ్మామని.. వాటి ద్వారా రూ.80 లక్షలు వచ్చాయని అని చెప్పింది. అవి తమ బామ్మ ఖాతాలోనే ఉన్నాయని తెలుపగా.. పక్కనే ఉన్న పదవ తరగతి విద్యార్థి విని.. ఎలాగైనా వాటిని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. 

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వెంటనే ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పాడు. వీరు మరికొందరికి ఈ విషయం చెప్పి ఆ వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బును కొట్టేయాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే సుమిత్ కటారియా అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఆ బాలికతో పరిచయం పెంచుకుని ఫొటోలు రప్పించుకున్నాడు. ఆ తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి బెదిరించాడు. దీంతో ఆ బాలిక బయపడి తన అమ్మమ్మకు తెలియకుండా పలుమార్లు వారి అకౌంట్లకు మనీ ట్రాన్సఫర్ చేసింది. 

Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

ఇక అక్కడితో ఆగని ఆ యువకులు మళ్లీ మళ్లీ డబ్బులు పంపించాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చారు. డబ్బులు మరి లేవని.. అయిపోయాయని ఆ బాలిక చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో ఆ బాలిక నేరుగా వెళ్లి జరిగిన విషయాన్ని తన స్కూల్ టీచర్‌కు చెప్పింది. ఆ టీచర్‌ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ayodhya : అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తాం.. డిప్యూటీ కలెక్టరేట్లకు ఈమెయిల్స్!

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది.  రామమందిరాన్ని పేల్చేస్తామంటూ  ఏకంగా డిప్యూటీ కలెక్టరేట్లకు ఈమెయిల్స్ కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు అయింది.

New Update
ayodhya ram mandir

ayodhya ram mandir

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది.  రామమందిరాన్ని పేల్చేస్తామంటూ  ఏకంగా డిప్యూటీ కలెక్టరేట్లకు ఈమెయిల్స్ కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు అయింది.  ఈ ఈమెయిల్స్ తమిళనాడు నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బాంబు బెదిరింపుపై అధికారుల దర్యాప్తు చేపట్టారు. అయోధ్య రామమందిరంతో పాటుగా అలీఘర్ కలెక్టరేట్‌ను బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్ వద్ద పోలీసు దళం డాగ్ స్క్వాడ్, ఇతర పరికరాల సహాయంతో దర్యాప్తు చేస్తోంది. అలీఘర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఆ ప్రాంగణంలోని అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి. 

రామ జన్మభూమి ట్రస్ట్‌కి బెదిరింపు మెయిల్స్

గత సోమవారం రాత్రి, రామ జన్మభూమి ట్రస్ట్‌కి బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అయోధ్యతో పాటు, బారాబంకి, ఇతర పొరుగు జిల్లాలను కూడా హై అలర్ట్‌లో ఉంచారు. అయోధ్యలోని రామాలయం 135.5 మిలియన్ల దేశీయ సందర్శకులను ఆకర్షించింది. 2024లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సందర్శించే ప్రదేశంగా తాజ్ మహల్‌ను అయోధ్య రామమందిరం అధిగమించింది. పర్యాటకులు, భక్తుల రద్దీ పెరుగుతున్నందున, స్థానిక పోలీసులు నగరం చుట్టూ గస్తీని పెంచారు. 

అయోధ్యలోని రామాలయం చుట్టూ దాదాపు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో భద్రతా గోడను నిర్మిస్తున్నామని, 18 నెలల్లో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నామని శ్రీ రామ జన్మభూమి ఆలయ భవన నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. కాగా అయోధ్యలోని రామాలయానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. 2024 సెప్టెంబర్ లో, ఒక యువకుడు సోషల్ మీడియాలో బెదిరింపు లేఖ రాశాడు. అతన్ని బీహార్‌లోని భాగల్పూర్ లో అరెస్టు చేశారు.  

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు