Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరోహి వైపు వెళ్తున్న బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన బొలెరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు, ఇద్దరు కొడుకులు, మరోవ్యక్తి మృతి చెందారు. బస్సులో ఉన్న 9మందికి గాయాలు అయ్యాయి.

New Update
Gujarat Road Accident.

Gujarat Road Accident

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిర్‌గఢ్ తాలూకాలోని కునియా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!

బస్సు - కారు

రాజస్థాన్ రాష్ట్ర రవాణా సంస్థ (RSRTC) బస్సు హైవేపై రాజస్థాన్‌లోని సిరోహి వైపు వెళుతోంది. అదే సమయంలో బొలెరో SUV కారు అదే రోడ్డులో రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో SUVలో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

Also Read: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఒకే కుటుంబానికి చెందిన వారు

అందులో ఒక జంట, వారి ఇద్దరు కుమారులు సహా మరో వ్యక్తి ఉన్నారు. వారిని దిలీప్ కొడిటియా (32), అతని భార్య మేవాలి (28), కుమారులు రోహిత్ (6), రిత్విక్ (3), మరో వ్యక్తి సుందరి భాగ సోలంకి (60)గా గుర్తించారు. అదే సమయంలో బస్సులో ఉన్న తొమ్మిది మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 

Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న మృతులను బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. కారు పైకప్పును కత్తిరించి.. లోపల ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఈ మృతులు అమిర్‌గఢ్ తాలూకాలోని ధన్‌పురా-విరంపూర్ గ్రామానికి చెందినవారని పోలీసు వర్గాలు తెలిపాయి.

అనంతరం గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి కారణం బొలెరో కారు డ్రైవర్ అని సమాచారం. ఆ కారు డ్రైవర్ హైవేలో రాంగ్ రూట్‌ నుండి వెళ్లి బస్సును ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. 

Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment