Lavoo Mamledar: మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఆటో డ్రైవర్..! (VIDEO)

గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్‌ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్‌ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. శనివారం ఆయన కర్ణాటకలో పర్యటించారు. కారు ఢీకొందని ఓ ఆటో డ్రైవర్‌ ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత మావ్లేదార్‌ కుప్పకూలి చనిపోయారు.

New Update
Goa EX MLA Lavoo Mamledar

Goa EX MLA Lavoo Mamledar

గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్‌ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్‌ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే లావూ మావ్లేదార్‌ శనివారం కర్ణాటకలోని బెలగావిలో పర్యటించారు.  ఖడేబజార్‌లోని ఓ హోటల్‌లో సూట్ రూం బుక్‌ చేసుకున్నారు. హోటల్‌ వైపు వెళ్తుండగా.. ఆయన కారు ఓ ఆటోను ఢీకొంది.  దీంతో ఆ ఆటోడ్రైవర్‌ మావ్లేదార్‌తో గొవడకు దిగాడు. ఆయనపై దాడి కూడా చేశాడు.

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

 తన ఆటోకు జరిగిన ప్రమాదంపై డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కానీ ఇందుకు మావ్లేదార్ ఒప్పుకోలేదు. హోటల్‌ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం హోటల్‌కు చేరుకున్నాక ఆ ప్రాంగణంలోనే మావ్లేదార్ కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!

అయితే  ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బెలగావి డీసీపీ రోహన్ జగదీశ్ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు మావ్లేదార్‌ మృతికి గల కారణాలపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. డ్రైవర్ దాడి వల్లే చనిపోయారా ? లేదా ఆయనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment