CPI(M): సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతితో ఆయనకు ఈ పదవి దక్కింది.

New Update
Former Kerala Minister MA Baby elected as General Secretary of CPI(M)

Former Kerala Minister MA Baby elected as General Secretary of CPI(M)

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్‌ వ్యవహరిస్తున్నారు. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

ఈ క్రమంలోనే మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన కేంద్ర కమిటీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని, అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అయితే ఈ కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్ నేతలైన  ఎం.ఎ.బేబీతో పాటు అశోక్‌ ధవలే, మహమ్మద్‌ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్‌ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ పార్టీలో ఓ వర్గం ఆలిండియా కిసాన్ సభ (AIKS) అధ్యక్షుడైన అశోక్ ధవలేకు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

ఇదిలాఉండగా.. 1954లో కేరళలోని ప్రాక్కుళంలో ఎం.ఎ బేబీ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు  పి.ఎం.అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ . బేబీ విద్యార్థి దశలో ఉన్నప్పడే కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఇప్పుడు SFI)లో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కేరళ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2012 నుంచి సీపీఎం పొటిల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

rtv-news | cpm | national-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.

New Update
west-bengal-teacher

west-bengal-teacher

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం

ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు.  మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని ..  అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. 

Also Read :  Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

Advertisment
Advertisment
Advertisment