వాహనదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 17 నుంచి ఈ రూల్స్‌ మార్పు

ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ మారబోతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ రూల్స్ మీరు తెలుసుకోకుంటే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.

New Update
Fast tag rules

Fast tag rules Photograph: (Fast tag rules)

ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు కాబోతున్నాయి. దేశంలో ఇప్పటికే అనేక మంది వారి వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో మీరు కూడా ఫాస్ట్ ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఈ తాజా మార్పులను మాత్రం తప్పక తెలుసుకోండి. ఎందుకంటే ఫిబ్రవరి 17, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ నియమాల ప్రకారం మీరు కొత్త చెల్లింపు విధానాలను పాటించకపోతే, అదనంగా మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. శీష్‌మహల్ విచారణకు ఆదేశం

మీరు హైవేపై ప్రయాణిస్తూ ఒక జిల్లా నుంచి మరొక జిల్లా లేదా రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మారేటప్పుడు టోల్ ప్లాజా వద్ద రోడ్డు పన్ను చెల్లించడం తప్పనిసరి. కానీ ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణ విధానం అమల్లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 28న కొత్త నియమాలను జారీ చేసింది.

Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

ఈ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 17, 2025 నుంచి టోల్ ప్లాజాకు చేరుకున్న తర్వాత 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్‌ అవుతుంది. ఆ సమయంలో చెల్లింపులు జరగవు. ఈ క్రమంలో కొత్త నియమాలకు అనుగుణంగా మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌ను మానిటర్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు, మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌ను చూసుకుని, అవసరమైతే ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కొత్త మార్పులు అమల్లోకి వచ్చినప్పుడు, మీరు రెట్టింపు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bharat Bhushan: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

New Update
 Bharat Bhushan

Bharat Bhushan

పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు  కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

దయచేసి నన్ను వదిలేయండి

భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు.  అప్పుడు అకస్మాత్తుగా  కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే  ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన  భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.  

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్‌లో ఆరు సంవత్సరాలలో జరిగిన అత్యంత దారుణమైనది, 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో 40 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత ఇదే అత్యంత దారుణమైనది. అమాయకపు టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క డగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment