Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్

నాగ్‌పూర్ హింసకు కారణమైన ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లోకల్ లీడర్ ఫహీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. హింస సమయంలో కొందమంది అల్లరి మూకలు మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి ప్రయత్నారు. దీనిపై కేసు నమోదైంది.

New Update
nagpur violence 123

nagpur violence 123 Photograph: (nagpur violence 123)

నాగ్‌పూర్‌ అల్లర్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస, మతఘర్షణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అల్లర్లకు కారణమైన వ్యక్తి స్థానిక రాజకీయ నాయకుడని పోలీసులు తెలుసుకున్నారు. రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైన ప్రధాన నింధితుడు ఫహీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని శుక్రవారం వరకు కస్టడీలోనే ఉంచనున్నారు. ఫహీమ్ ఖాన్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లోకల్ లీడర్.

Also read: SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

ఔరంగజేబు సమాధిని తవ్వాలని విశ్వహిందు పరిషత్ ర్యాలీ చేసినప్పుడు ఫహీమ్ ఖాన్ అక్కడున్న వారిని రెచ్చగొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. నాగ్‌పూర్ అల్లర్ల కేసులో ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశారు. ఆరు కేసులు నమోదు చేసి 1,200 మందిపై ఫిర్యాదులు చేశారు. వీరిలో ఇప్పటివరకు 200 కంటే తక్కువ మంది పేర్లు నమోదు చేయబడ్డాయి. మిగిలిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. సెంట్రల్‌ నాగ్‌పూర్‌లోని మహల్‌ ప్రాంతంతోపాటు సమస్యాత్మక ప్రదేశాల్లో పోలీసుల కర్ఫ్యూ విధించారు.

Also read :  బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు!

రెండు వర్గాల ఘర్షణలో దాదాపు 50 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక పోలీసుపై గొడ్డలితో దాడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. అల్లర్ల సమయంలో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో అల్లరిమూకలు అసభ్య ప్రవర్తించారు. ఆందోళనల మసుగులో మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యం చేసేందుకు యత్నించారని సమాచారం. దీనికి సంబంధించి గణేష్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment