భారత్‌కు అమెరికా మెండి చేయి.. 21 మిలియన్ డాలర్ల నిధులు రద్దు

అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.

New Update
trump musk

Elon Musk with trump Photograph: (Elon Musk with trump)

అమెరికా భారత్‌కు అందించే విదేశీ సాయంలో కోత విధించింది. ఎలన్ మస్క్ అధ్యక్షతన అమెరికాలో కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లను తగ్గించాలని నిర్ణయించుకుంది. దీంతో భారత్‌కు రావాల్సిన 21 మిలియన్ డాలర్లను కూడా అమెరికా రద్దు చేసింది. ఇండియాలో ఎలక్షన్లలో ఓటర్ల అవగాహన, ఓట్ల లెక్కింపు వంటి కార్యక్రమాలకు ప్రతి ఏటా అమెరికా ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని రద్దు చేయాలని ఎలన్ మస్క్ ట్రంప్‌కు సూచించారు.

అమెరికాతోపాటు బంగ్లాదేశ్‌కు ఇచ్చే 29 మిలియన్ డాలర్లలను రద్దు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ విభాగం తయారు చేసిన బడ్జెట్‌లో ఎలన్ మస్క్ ప్రకటించారు. ఇండియాలో ఓటర్ల సంఖ్య పెంచడం, బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వం కోసం అమెరికా ఈ ఆర్థిక సాయం చేస్తూవచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో భారతదేశం, బంగ్లాదేశ్ సహా అనేక దేశాలకు మిలియన్ల డాలర్ల నిధులను అమెరికా రద్దు చేసింది.  భారతదేశానికి కేటాయించిన $21 మిలియన్లు ప్రత్యేకంగా దేశ ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, ఈ నిధులు ఇకపై అందుబాటులో ఉండవని DOGE సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రకటించింది.

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

ఇతర దేశాలకు సాయం చేస్తూ అమెరికా దివాలా తీస్తోందని మస్క్ పలు మార్లు అన్నారు. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ అనే విభాగానికి మస్క్‌ను హెడ్‌గా నియమించాడు. ఈ శాఖ ప్రభుత్వ పాలనా విభాగాలను, సామర్థ్యాన్ని అంచానా వేస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తరుపున ఎలన్ ఆదివారం అమెరికా సమగ్ర ప్రణాళిక బడ్జెట్ రూపొందించింది. ఇందులో విదేశీ సాయం కింద అమెరికా ఖర్చు చేస్తున్న 723 మిలియన్ డాలర్లలో కోత విధించాలని తెలిపింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్‌ 29 మిలియన్ డాలర్లు, ఇండియాకు 21 డాలర్ల నిధులు క్యాన్సల్ చేయనుంది అమెరికా. మోదీ రెండు రోజుల క్రితమే అమెరికా పర్యటనలో మస్క్, ట్రంప్‌లను కలిసి వచ్చారు. మోదీ బేటీ తరవాత ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Also read :  Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేశారని స్పష్టం చేసింది.

New Update
Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారని.. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. తోటి స్నేహితులు ఒక అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లో గ్రౌండ్‌కి, మేడ మీదకి తీసుకెళ్లారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారు. సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చింది. ఈ వీడియో బయటకు వెళ్లడంతో దీన్ని తప్పుగా చిత్రీకరించారు. ఇలా చేసిన విద్యార్థులకు వర్సిటీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసిందని'' తెలిపారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఇదిలాఉండగా.. జిందాల్ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడున్న సిబ్బంది ఆ సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. దీంతో తాజాగా దీనిపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం ఇదంతా ప్రాంక్ అని స్పష్టం చేసింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

 telugu-news | rtv-news | haryana | national-news 

 

 

Advertisment
Advertisment
Advertisment