BIG BREAKING: కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు

కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.

New Update
Kerala CM Pinarayi vijayan

Pinarayi vijayan

కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు. అయితే మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే కన్నూరులోని ఆయన మరో నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సంస్థ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ఎందుకంటే ఈ సంస్థ విజయన్ కుమార్తె టీ వీణాకు చెందినది. ఇది ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీకి సుమారు రూ.1.72 కోట్లను చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి 2019 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్ర‌భాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెష‌ల్’ అప్డేట్!

ఆ సంస్థకు చెందిన ఇళ్లలో..

ఆ కంపెనీ ఎలాంంటి సేవలు కూడా అందించకపోయినా చెల్లింపులు జరిగాయని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు విజయన్ కుమార్తె వీణను ఇప్పటికే విచారించారు. ఆమె భర్త, ఎమ్మెల్యే మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు సీఎంఆర్ఎల్ సంస్థకు చెందిన వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు చేపడుతున్నారు. ఈ ఈడీ సోదాలను అడ్డుకోవాలని సీఎంఆర్ఎల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే కేరళ హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈడీ దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అధికారులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు