Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. 2019లో హోర్టింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో నమోదైన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా  మరో ఎదురుబెద్ద తగిలింది.  2019లో ద్వారకలో భారీ హోర్టింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్‌ కోర్టును కోరారు. 

Also Read: రన్యా రావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్‌ కీలక ఆదేశం

దీంతో పిటిషనర్ చేసిన అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు అంగీకారం తెలిపింది. అయితే ప్రజల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2020లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ ఫిర్యాదును తోసిపుచ్చారు. దిగువ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సెషన్ కోర్టు కొట్టివేసింది. ఫిర్యాదును మళ్లీ పరిశీలించడం కోసం వెనక్కి పంపింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి.   

Also Read: పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

ఇదిలాఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 27 తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే న్యూఢిల్లీ స్థానం నుంచి పోటిచేసిన కేజ్రీవాల్‌ కూడా ఈసారి ఓడిపోయారు. లిక్కర్‌ స్కామ్, మనీలాండరింగ్ కేసులు,  కోట్ల ఖర్చుతో సీఎం నివాసాన్ని లగ్జరీగా నిర్మించడం లాంటి అంశాలన్నీ ఆప్‌పై ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. అధికారం పోవడంతో కేజ్రీవాల్‌ ఇప్పుడు మరిన్ని సమస్యల్లో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: డంకీరూట్‌ లో మరో ఇండియన్‌ మృతి..అక్కడే భార్య బిడ్డలు!

Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment