Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ

వర్ఫ్ బోర్డు బిల్లును న్యాయస్థానంలో సవాలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు 2025 లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

New Update
jairam ramesh

jairam ramesh

Waqf Bill: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 బుధవారం లోక్‌సభలో, గురువారం రోజు రాజ్యసభలో అమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. కేంద్ర మైనార్టీ సంక్షమ శాఖమంత్రి కిరణ్ రిజుజి ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం పెడితే ఇక చట్టంగా మరునుంది.  బీజేపీ స‌ర్కారు తెచ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును సుప్రీంకోర్టులో స‌వాల్ చేయ‌నున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 

 

Also read: హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు

సుప్రీంలో కేసు..

వక్ఫ్ బోర్టు బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లనున్నట్లు మార్చి 4న కాంగ్రెస్ పార్టీ నేత జ‌య‌రాం ర‌మేశ్ తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ బద్దతను ప్రశ్నిస్తోందని, ఇండియాలో మైనార్టీలైన ముస్లీంల హక్కులను హరించి వేస్తోందని ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. 2019లో ప్రభుత్వం తెచ్చిన సీఏఏను సుప్రీంలో స‌వాల్ చేశామ‌ని, 2005 ఆర్టీఐ చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ను ప్రశ్నిస్తూ సుప్రీంలో స‌వాల్ చేశామ‌న్నారు. ఎన్నిక‌ల నిర్వహ‌ణ అంశంపై తెచ్చిన స‌వ‌ర‌ణ‌ల‌ను ప్రశ్నిస్తూ కూడా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు ఫైట్ చేస్తోంద‌న్నారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చ‌ట్టం అమ‌లను నిల‌దీస్తూ కూడా సుప్రీంలో కేసు వేశామ‌న్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment