Betting Apps : నటుడు ఆలీని ఇరికించిన నా అన్వేషణ

తెలంగాణ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌ కేసులు సంచలనంగా మారాయి. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు అలీ వంతు వచ్చింది. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అలీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.

New Update
 Betting Apps

Betting Apps

Betting Apps : తెలంగాణ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌ కేసులు సంచలనంగా మారాయి. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ కమెడియన్ అలీ కూడా ఇందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ తన యూట్యూబ్ ఛానల్ లో ఆలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని.. అలీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందంటూ బాంబు పేల్చాడు ప్రపంచ యాత్రికుడు.ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న అన్వేష్ ఓ మజీద్‌ ముందు చేతిలో ఖురాన్‌ పట్టుకుని మాట్లాడుతూ ఓ వీడియో రూపొందించాడు. ఖురాన్‌ సాక్షిగా ఒక్క బూతు కూడా మాట్లాడుతున్నానంటూ వీడియో మొదలు పెట్టాడు. రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్న అలీ, అది కూడా రంజాన్‌ మాసంలో బెట్టింగ్‌ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్‌ చేశారంటూ ప్రశ్నించారు? సహాయం పేరుతో చాలా మోసం చేశారంటూ విమర్శించారు. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
 
'బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టి వెయ్యి సినిమాల్లో నటించారు. 50 సినిమాల్లో హీరోగా నటించారు. సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 1000 కోట్లు ఉంటుంది. అలాంటి వ్యక్తి బెట్టింగ్‌ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్‌ చేశాడు' అంటూ ప్రశ్నించాడు. అలీ జనాలను ఎలా మోసం చేశాడో అన్వేష్‌ చెప్పుకొచ్చాడు. 

'అలీ గారి భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్‌కు సుమారు 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరు కనివినీ ఎరగని విధంగా తెలుగులో బిర్యానీ మోసం చేశారు. రూ. 10 వేలతో చికెన్‌ బిర్యానీ తయారు చేసి కొంతమంది అనాధలకు ఇచ్చారు. అయితే ఈ వీడియోను 50 లక్షల మంది చూశారు. ఈ వీడియో ద్వారా వీరికి యూట్యూబ్‌ సుమారు రూ. 5 లక్షలు ఇచ్చింది. ఇందులో ఏం తప్పులేదు. కానీ ఈ వీడియోలో బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేశారు. వేల కోట్లు ఆస్తులు ఉండి, సహాయం పేరుతో ఇలా మోసం చేస్తే అల్లా క్షమిస్తారా.?' అంటూ ప్రశ్నించారు. బిర్యానీ ప్యాకెట్ల పేరుతో సహాయం చేస్తున్నట్లు నటించి.. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోవడం మోసం కాదా అంటూ అన్వేష్‌ విరుచుకుపడ్డాడు. భారతదేశాన్ని దెబ్బ తీయాలని పలు దేశాలు చేస్తున్న కుట్రలో భాగం కావడం ఎంత వరకు సబబు? అంటూ అన్వేష్‌ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

Also Read :  బడికి వెళ్లమన్నందుకు..ఆరుగురు విద్యార్థులు అదృశ్యం!
 
ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి అంటూ ఆలీని విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రపంచ యాత్రికుడు పెట్టిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్... కమెడియన్ ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తున్న ముసుగులో... జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? అంటూ కమెడియన్ ఆలీపై నిప్పులు.. జరుగుతున్నారు. మరి దీనిపై కమెడియన్ ఆలీ ఎలా స్పందిస్తారో చూడాలి. అటు ప్రపంచయాత్రికుడు ఎవరిని టార్గెట్ చేసిన... వాళ్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆలీ విషయంలో తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read :  టాప్‌ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య!
 
 
 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda scam: MP, MLAల స్పెషల్‌ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్

ముడా స్కామ్‌లో లోకయుక్తా పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఈడీ MP, MLAల స్పెషల్‌ కోర్టులో సవాలు చేసింది. ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో 8 పేజీల పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ త్వరలోనే కోర్టు విచారించనుంది.

New Update
muda scam case

muda scam case Photograph: (muda scam case)

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ ఎదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల స్కామ్‌లో దర్యాప్తు చేసిన లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లోకాయుక్తా పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల కోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఈడీ 8 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. లోకాయుక్త నివేదికలో ఆయన నిర్దోషి అని తప్పుగా పేర్కొన్నారని వాదిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది ED. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఇతరులపై పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Also read: Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

ED పిటిషన్‌ను ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తోంది. లోకాయుక్త నివేదికను అంగీకరించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక హైకోర్టు గతంలో ED సమన్లను రద్దు చేసింది. కానీ ఇప్పుడు దర్యాప్తు కోసం ఒత్తిడి మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021లో మైసూరులోని విజయనగర ప్రాంతంలో 14 ప్లాట్లను ముడా సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా, కేసరే గ్రామంలో పార్వతి యాజమాన్యంలోని 3.16 ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకుందనే ఆరోపణపై ED దర్యాప్తు చేస్తోంది. ఈ కేసునే ముడా స్కామ్‌గా కొనసాగుతుంది. ఈడీ విచారణలో సిద్ధరామయ్య తప్పు చేశారని వెల్లడైంది.  కానీ 2025 ఫిబ్రవరిలో లోకయుక్త పోలీసులు ఆయన కుటుంబం నిర్థోషి అని క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ విషయంపై ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల స్పెషల్ కోర్టుకు వెళ్లింది.

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment