Chandrayaan 3 : చంద్రమండలంపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 మిషన్

చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై తాజా వాతావరణ పరిస్థితులను అధ్యాయనం చేసి డేటా పంపింది. డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మూన్‌పై పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతల్లో వేరియేషన్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

New Update
Chandrayaan3's Vikram

Chandrayaan3's Vikram Photograph: (Chandrayaan3's Vikram)

చంద్రుడి దక్షిణ దృవంపైకి పంపించిన చంద్రయాన్ 3 మిషన్ కీలక డేటాను పంపింది. 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయిన ఈ మిషన్, చంద్రుని ఉపరితలం, కింద, ముఖ్యంగా ధ్రువ ప్రదేశాలలో ఉష్ణోగ్రత డేటాను శాస్త్రవేత్తలకు పంపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన ChaSTE ప్రోబ్, ఉపరితలం నుండి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను కొలిచింది. ఇది చాలా వేరియబుల్ పరిస్థితులను వెల్లడించింది. ల్యాండింగ్ సైట్ శివ శక్తి పాయింట్ వద్ద ఉష్ణోగ్రతలు పగటిపూట 82C నుండి రాత్రి 170C వరకు ఉన్నాయని తెలిసింది.

Also read: All party meeting: నేడు అన్నీ పార్టీల MPలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమావేశం

పరిశోధకులు డెవలప్ చేసిన ఒక నమూనా ప్రకారం.. సూర్యుని నుండి దూరంగా ఉండి.. 14 డిగ్రీల కంటే ఎక్కువ వాలు కలిగిన చంద్రమండల ఉపరితలం మంచుతో పేరుకుపోయాయని అంచానా వేస్తున్నారు. ఈ విషయాన్ని  కమ్యూనికేషన్స్ ఎర్త్ & ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ప్రచురించారు. తాజా డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు.

Also Read: BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

చంద్రుని ఉపరితలం క్రింద మరిన్ని ప్రదేశాలలో మంచు ఉండవచ్చని ఈ డేటా చెబుతుంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో చంద్రయాన్-3 పరిశోధన బృందాన్ని దుర్గా ప్రసాద్ కరణం లీడ్ చేస్తున్నారు. ఈ బృందం మూన్‌పై మంచు ఏర్పడటంలో పెద్ద ఎత్తున, ఉష్ణోగ్రత వైవిధ్యాల చూపిస్తున్నాయని తెలిపింది. చంద్రుడిపై మానవ మనుగడ సాధ్యమేనా అని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment