Supreme Court: క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులకు శుభవార్త

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ప్రస్తుతమున్న ఆరేళ్ల అనర్హత వేటుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పింది.

New Update
Supreme Court

Supreme Court

భారత్‌లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినటువంటి నేతలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL)పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. 

Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం

అలాంటి వాళ్లకు జీవిత కాలం నిషేధం విధించాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత వేటుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తే సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులు రాజకీయాల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని అశ్వినీ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు.

Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఈ క్రమంలోనే ఈ వ్యాజ్యంపై కేంద్రం స్పందిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇందులో కేంద్రం పలు కీలక విషయాలను ప్రస్తావించింది. చట్ట సభలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేవని కోర్టులు భావిస్తేనే రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని చెప్పింది. అంతేకాని చట్టాలు ఎలా చేయాలో, ఎలాంటి మార్పులు చేయాలో పార్లమెంటుకు చెప్పే అధికారం కోర్టులకు లేదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.

Also Read: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్

Also Read: ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.

New Update
west-bengal-teacher

west-bengal-teacher

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం

ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు.  మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని ..  అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. 

Also Read :  Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

Advertisment
Advertisment
Advertisment