పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు..!

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే లేదా వచ్చే సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నాయి.

New Update
One nation

గత కొంతకాలంగా జమిలి ఎన్నికల అంశం దేశంలో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లోనే లేదా వచ్చే సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఇటీవల సమర్పించిన రిపోర్టును కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదించింది. 

Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు

ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానం అమలు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని కోవింద్ కమిటీ వెల్లడించింది. ఆ తర్వాత ఇది వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని చెప్పింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలను సైతం కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు జమిలి ఎన్నికల విషయంపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 30కి పైగా పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించగా.. కాంగ్రెస్‌తో పాటు మరో 15 పార్టీలు వ్యతిరేకించాయి.    

Also Read: అదానీ, మోదీతో రాహుల్‌ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్

అయితే దేశంలో జమిలి ఎన్నికల విధానం అనేది ఆచరణాత్మకం కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. తాము ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య మనుగడ సాగించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని మల్లికార్జున ఖర్గే ఖరాఖండీగా చెబుతున్నారు. మరీ ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ప్రవేశపెడతారా ? లేదా వచ్చే సమావేశాల్లో ప్రవేశపెడతారా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.   

Also Read: జీవో 46పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

Also Read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్‌ 19 మహమ్మారి..39 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment